Metro Employees Strike: హెదరాబాద్ మెట్రో సిబ్బంది సమ్మె.. కారణమిదే..?
హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం నాడు సమ్మె (Metro Employees Strike)కు దిగారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలనే డిమాండ్ తో తాత్కాలిక ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దింతో హైదరాబాద్ మెట్రో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు.
- By Gopichand Published Date - 11:05 AM, Tue - 3 January 23
హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం నాడు సమ్మె (Metro Employees Strike)కు దిగారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలనే డిమాండ్ తో తాత్కాలిక ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దింతో హైదరాబాద్ మెట్రో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. ఎల్బీనగర్- మియాపూర్ మెట్రో స్టేషన్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమకు జీతాలు పెంచాలంటూ 150 మంది ఆందోళన చేస్తున్నారు.
సెలవులు, వర్క్ టైమింగ్స్ సరిగా లేవని ఆరోపిస్తున్నారు. తమకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎల్బీ నగర్ నుండి మియాపూర్ లైన్ లో టికెట్ కౌంటర్లలో సుమారు 300 మంది విధులు నిర్వహించాలి. కానీ మంగళవారం 150 మంది మాత్రమే విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.
Also Read: Five Died: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ఇప్పటివరకు తమ వేతనాలు కూడా పెంచలేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ రూట్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 5 ఏళ్లుగా 11 వేల రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది