T Congress : కాంగ్రెస్ పార్టీలో గ్రూపులపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
T Congress : మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు పార్టీకి ఉలిక్కిపడేలా చేశాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో కులాల, వర్గాల ఆధారంగా విభేదాలు తీవ్రంగా ఉన్నాయి
- By Sudheer Published Date - 01:09 PM, Sun - 3 August 25

తెలంగాణ కాంగ్రెస్ (T Congress)లో గ్రూపు రాజకీయాలపై పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే టీపీసీసీ అధిష్టానం ఎన్నోసార్లు గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని నేతలను హెచ్చరించినప్పటికీ, మహేష్ కుమార్ గౌడ్ మాత్రం గ్రూపులు ఉండటం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న జనహిత పాదయాత్ర సందర్భంగా జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీ నేతలు తమకు నచ్చిన నాయకులను పొగడొచ్చని, కానీ ఇతర గ్రూపులను కించపరిచేలా వ్యవహరించకూడదని ఆయన అన్నారు.
మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు పార్టీకి ఉలిక్కిపడేలా చేశాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో కులాల, వర్గాల ఆధారంగా విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటప్పుడు గ్రూపు రాజకీయాలకు అవకాశమివ్వడమంటేనే పార్టీ అంతర్గత సమస్యలను మరింత ముద్రించడమేనని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రూపులు ఉండొచ్చని చెప్పినప్పటికీ, లక్ష్మణ రేఖ దాటకూడదన్న హెచ్చరికను ఆయన జోడించినా, ఇది ఎంతవరకు అమలవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడే ఇలా మాట్లాడడం వల్ల నాయకత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Pahalgam attacker : పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఉగ్రవాదులే.. వెలుగులోకి మరో ఆధారం
ఇక పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కార్యకర్తలతో కలసి వడిగా పాదయాత్రలో పాల్గొన్నారు. సంగ్ పేట నుండి జోగిపేట వరకు ఆరు కిలోమీటర్లు నడిచి కార్యకర్తలకు మద్దతుగా నిలిచారు. జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శ్రమదానం చేశారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమయ్యారు. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ‘భారత్ జోడో యాత్ర’ ఎగ్జిబిషన్ను కూడా తిలకించారు. ఈ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తల్లో సానుకూల శక్తిని నింపినప్పటికీ, గ్రూపు రాజకీయాల వ్యాఖ్యలు మళ్లీ చర్చలకు దారితీశాయి.
కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మంత్రులు చేసిన ఆరోపణలు కూడా పాదయాత్రలో హైలైట్గా నిలిచాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన కేసీఆర్, ఫార్ములా ఈ రేసింగ్లో కేటీఆర్ అవినీతికి పాల్పడి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలనీ, ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించాలని కార్యకర్తలను ఉద్ఘాటించారు. ఈ విమర్శలు బలమైన రాజకీయ సందేశాలుగా మారినా, గ్రూపు రాజకీయాలపై చెలరేగిన చర్చ మాత్రం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తోంది.