HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Maharashtra People Want Tenlangana Schemes Says Kcr

CM KCR: మహారాష్ట్ర ప్రజలు తెలంగాణాలో విలీనం చేయాలని కోరుతున్నారు: కేసీఆర్

టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలో అనేక పర్యటనలు చేపట్టారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 01-07-2023 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Election Sankharavam! Fix The Moment!!
Kcr Election Shankharavam! Fix The Moment!!

CM KCR: టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలో అనేక పర్యటనలు చేపట్టారు. అక్కడ స్థానిక లీడర్లను బీఆర్‌ఎస్‌లో కలుపుకున్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌గా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ప్రజలు తమ సరిహద్దు గ్రామాలను తెలంగాణాలో విలీనం చేయాలనీ వేడుకొంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు.

ఆసిఫాబాద్ లో గిరిజన లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆసిఫాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది రైతులు నాలుగు లక్షల ఎకరాలకు పైగా ‘పోడు’ భూములను సాగు చేసుకునే హక్కును పొందుతారని, అటవీ భూములను ఆక్రమించుకున్న ‘పోడు’ రైతులపై గతంలో పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్నారు సీఎం కెసిఆర్. ఇంటింటికీ పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ‘రైతు బంధు’ , ఉచిత విద్యుత్ సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఆయన హైలైట్ చేశారు.

గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ.అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు వైరల్ జ్వరాలతో బాధపడేవారి సంఖ్య తగ్గిందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయడం మరియు వైద్య సదుపాయాలు మెరుగుపరచడం వల్ల ఇప్పుడు సమస్య లేదని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో కెసిఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ వైఖరిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి దళారులను వ్యవస్థలోకి వదులుతారని సీఎం చెప్పారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టేది మళ్ళీ బిఆర్ఎస్ మాత్రమేనని అన్నారు కెసిఆర్.

మహారాష్ట్రపై సీఎం కెసిఆర్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ పథకాలను కావాలని అనుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కొన్ని గ్రామాల సర్పంచ్‌లు తమ ప్రభుత్వాన్ని తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారని చెప్పారు. కుదరకపోతే తెలంగాణ పథకాలను అక్కడ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని కెసిఆర్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ విస్తరణకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు కెసిఆర్ మహారాష్ట్రను పలు మార్లు సందర్శించారు. నాందేడ్ తదితర ప్రాంతాల్లో కెసిఆర్ బహిరంగ సభలు నిర్వహించి బీఆర్ఎస్ ని బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఆయన ప్రసంగించారు.

Read More: Criminals Vs Buddhist Monks : నేరాలు చేశాక.. సన్యాసులుగా మారుతున్నారట!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asifabad
  • brs
  • kcr
  • maharastra
  • Podu Pattalu
  • public meeting
  • schemes
  • telangana news

Related News

Harish Rao Kmm

Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని, అభివృద్ధి కంటే అవినీతికే పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇప్పటికే మార్పును కోరుకుంటున్నారని హరీష్ రావు తన ప్రసంగంలో స్పష్టం

    Latest News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd