KTR Next CM: కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్!
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఇంటింటి
- By Balu J Published Date - 01:29 PM, Wed - 19 October 22
తెలంగాణలో నెక్ట్స్ సీఎం ఎవరు? అటు టీఆర్ఎస్, ఇటు ఇతర పార్టీల్లో చర్చలు తలెత్తడం కామన్ గా మారింది. కేసీఆర్ ఎప్పుడైతే జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపారో, ఆ రోజు నుంచే సీఎం పీఠం గురించి రకరకాల చర్చలు వినిపించాయి. ఇప్పటికే తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు నిర్వరిస్తున్న కేటీఆర్.. నెక్ట్ సీఎంగా అభివర్ణిస్తున్నారు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు. మునుగోడు ఎన్నిక ముగింట మరోసారి కేటీఆర్ సీఎం ముచ్చట వినిపించింది.
గతంలో టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ సీఎం అంటూ కామెంట్స్ చేయగా, తాజాగా మరోసారి శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇంటింటి ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత సీఎం కేసీఆర్, కాబోయే సీఎం కేటీఆర్ అని అన్నారు. రాబోయే సీఎం మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారని తెలిపారు. మునుగోడులో గెలిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సీఎం పీఠం ప్రస్తావనకు చర్చనీయాంశమమైంది.
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య గౌడ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. #MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/j8DEZNsFzC
— V Srinivas Goud (@VSrinivasGoud) October 18, 2022
Related News
Congress Next CM Candidate : నెక్స్ట్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డేనా..?
సీఎం అయ్యే అర్హత తనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి