KTR : ఈ పుట్టినరోజుకు బైజూస్ ట్యాబ్ లు అందిస్తున్నాను..!!
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు.
- By hashtagu Published Date - 02:30 AM, Mon - 25 July 22
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. తన వయస్సులో మరో ఏడాది పెరిగిందని…46వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమాభిమానాలు చూపించిన అందరికీ ఎప్పటికీ విధేయుడినై ఉంటాయనని వివరించారు. అయితే పుట్టినరోజు జరుపుకోవడంలో ఓ అర్థం ఉండాలన్నారు కేటీఆర్ . మూడేళ్ల కిందట Gift a smile కార్యాచరణ ప్రారంభించినట్లు కేటీఆర్ వెల్లడించారు.
Gift a smileలో భాగంగా తొలి ఏడాది నేనే ఆరు అంబులెన్స్ లను విరాళంగా ఇచ్చాను. టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి 120 అంబులెన్స్ లు విరాళంగా ఇచ్చారు. రెండో ఏడాది నేను నా పర్సనల్ గా 200కి పై ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను దివ్యాంగులకు అందించాను. నా సహచర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ సంఖ్యను 1,100వరకు తీసుకెళ్లారు. ఈ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం వ్యక్తిగతంగా నాకు చాలా సంత్రుప్తిని ఇచ్చింది.
కాగా ఈ ఏడాది గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే ఇంటర్ విద్యార్థులకు బైజూస్ ట్యాబ్ లు వ్యక్తిగతంలో పంపిణీ చేస్తున్నాను. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
This year as part of #GiftASmile I will personally distribute BYJU’s powered tablets with software & coaching material to Govt College students (11th/12th) in Sircilla Dist
This will support students with additional material to help them train better for competitive exams 😊
— KTR (@KTRTRS) July 24, 2022
As I turn older (46 now), am eternally grateful for all the love & affection 🙏
To celebrate in a meaningful way, had launched #GiftASmile campaign 3 years ago
The first year, I started with a donation of 6 Ambulances & eventually 120 ambulances were donated by TRS MPs & MLAs pic.twitter.com/qAR5cBNral
— KTR (@KTRTRS) July 24, 2022
Related News
Lok Sabha Polls : నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు
నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది