KTR Meets Kavitha : చెల్లి కవితతో కేటీఆర్ భేటీ..
కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.
- Author : Sudheer
Date : 14-04-2024 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో అరెస్టై..ప్రస్తుతం సీబీఐ (CBI) కస్టడీలో ఉన్న కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత (Kavitha) ను తన అన్న మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కలిశారు. ఈరోజు ఉదయం తెలంగాణ భవన్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్..సాయంత్రం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు.
We’re now on WhatsApp. Click to Join.
కేటీఆర్ వెంట కవిత భర్త అనిల్ కుమార్, లాయర్ మోహిత్ రావు ఉన్నారు. ఈ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ కేటీఆర్ కవితను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కవితను సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. అంతకు ముందు కవిత తీహార్ జైల్లో ఉంది.
Read Also : Siddharth : పాపం సిద్ధార్థ్.. అసూయకి బాధకు మధ్య స్థితి..!