KTR London: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి…ఆరైవల్ కంపెనీని కోరిన మంత్రి కేటీఆర్..!!
- By Hashtag U Published Date - 11:22 AM, Sun - 22 May 22
విదేశీటూర్ లో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీలతో భేటీ అవుతున్నారు కేటీఆర్. ఇందులో భాగంగానే అరైవల్ యూకే ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోపెట్టుబడులు పెట్టడమే కాదు…కంపెనీకి చెందిన విద్యుత్ బస్సులు, వ్యాన్ లు , అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రవేశపెట్టాలని వారిని కోరారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం బాన్ బెరీలో అరైవల్ యూకే కంపెనీ ప్రతినిధులు కేటీఆర్ బ్రుందం భేటీ అయ్యింది.
కాగా హైదరాబాద్ లో అల్లాక్స్ కంపెనీతో ఇప్పటికే అరైవల్ యూకే కలిసి పనిచేస్తుంది. అల్లాక్న్ రీసోర్సెస్ ప్రతినిధులు కూడా ఈ భేటీలో మంత్రి కేటీఆర్ వెంట ఉన్నారు. హైదరాబాద్ మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం కంపెనీ బస్సులు ప్రవేశపెట్టాల్సిందిగా కేటీఆర్ ఈ సందర్భంగా అరైవల్ యూకే ప్రతినిథులను కోరారు. ఈవీ రంగంలో ఇప్పటికే తెలంగాణ ముందుందని అరైవల్ యూకే కూడా తమతో చేతులు కలిపితే…ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరింత వేగంగా ముందుకెళ్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
We welcome Arrival to Telangana! Looking forward to see these amazing electric vehicles manufactured in Telangana and be a part of our transport network. Wishing all the best to Arrival & ALLOX for their journey ahead: Minister @KTRTRS #InvestTelangana pic.twitter.com/jop1D719Bv
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 21, 2022
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ