KTR Adopts Munugode: కూసుకుంట్లను గెలిపిస్తే, మునుగోడును దత్తత తీసుకుంటా!
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని
- By Balu J Published Date - 04:21 PM, Thu - 13 October 22
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం ప్రకటించారు. మునుగోడులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.
మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి మునుగోడు నియోజకవర్గానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి అభివృద్ధి పనులకు సంబంధించిన అన్ని పనులను నిర్వహిస్తానని కేటీఆర్ తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తనకు సోదరుడిలాంటి వ్యక్తి కాబట్టి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. హోరాహోరీగా సాగుతున్న మునుగోడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరిన కేటీఆర్.. బీజేపీ, ఆ పార్టీ అభ్యర్థి తమ ఆర్థిక పలుకుబడిని ప్రదర్శించారని ఘాటుగా విమర్శించారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నాలుగేండ్ల పాటు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొట్టాను అంటున్నాడు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని పేర్కొన్నారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ మాకు మోదీ ఇచ్చిండని ఆయనే చెబుతాడు. మళ్లీ మాది చిన్న కంపెనీ అని అంటడు. మరి చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన వారెవరు? దాని వెనుక ఉన్నది ఎవరు? మునుగోడుకు అవసరం లేని ఎన్నిక ఇది. బలవంతంగా మీ మీద రుద్దబడుతున్న ఎన్నిక ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి @Koosukuntla_TRS గారి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS, మంత్రి శ్రీ @jagadishTRS, తదితరులు.#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/hZeNzTzPIe
— TRS Party (@trspartyonline) October 13, 2022
Related News
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు