Telangana: ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ రహస్య చర్చలు, గెలుపు లక్ష్యంగా మంతనాలు?
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
- By Balu J Published Date - 12:07 PM, Wed - 22 November 23
Telangana: ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
తాజా నివేదికల ప్రకారం, ఎన్నికల్లో విజయం సాధించేందుకు చివరి నిమిషంలో వ్యూహాలు రచించేందుకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పీఏసీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ను కేసీఆర్ పిలిచి రహస్య చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మరో రాజకీయ వ్యూహకర్త గురురాజ్ అంజన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో వెల్లడించారు.
“తెలంగాణలో అతిపెద్ద సంచలనం: #TelanganaAssemblyElections2023 #PKMeetsKCR” అని ఆయన వెల్లడించారు. అంజన్ ప్రకారం.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ BRS పతనాన్ని అంచనా వేసింది. దీంతో కేసీఆర్, పీకే మధ్య మూడు గంటల పాటు చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఇప్పుడు రాబోయే తొమ్మిది రోజుల్లో BRS కోసం PK ఏమి సాధించగలదనే ప్రశ్న తలెత్తుతుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం, అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం లాంటివి కేసీఆర్ కు సవాల్ గా మారాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
Also Read: KTR: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వైబ్ సైట్ ను ప్రారంభించిన కేటీఆర్
Related News
Kingfisher Beer Light : లైట్ బీర్లు అందజేయాలంటూ తెలంగాణ సర్కార్ కు లేఖ ..
తెలంగాణ (Telangana ) లో ఎండలు (Summer ) ఏ రేంజ్ లో దంచి కొడుతున్నాయో తెలియంది కాదు..ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 07 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు , ఫ్యాన్లు , ఏసీలకు అత్తుకుపోతున్నారు. ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తెగతాగేస్తూ ఉండడం తో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత