CM KCR: రేపు కామారెడ్డి నేతలతో కేసీఆర్ భేటీ, గెలుపు వ్యూహాలపై చర్చ
కేసీఆర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్నుకోవటమే రాజకీయ పరిశీలకు లను ఆశ్చర్యపరిచిన విషయం .
- Author : Balu J
Date : 06-09-2023 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
CM KCR: సెప్టెంబర్ 7న ప్రగతి భవన్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ నేతలను బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తన సొంత గజ్వేల్ సెగ్మెంట్ నుంచి కాకుండా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇక్కడ గమనార్హం. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో సహా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహ కార్యక్రమంలో కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు.
పెళ్లి వేడుకలో కామారెడ్డి నుంచి పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేతను కోరారు. సెల్ఫీల కోసం కూడా చుట్టుముట్టారు. అనంతరం గురువారం జరిగే ప్రగతి భవన్ సమావేశానికి హాజరు కావాలని పార్టీ వర్గాలు కామారెడ్డి నియోజకవర్గం ఎంపిక చేసిన నేతలకు సమాచారం అందించాయి. కేసీఆర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్నుకోవటమే రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచిన విషయం . నిజానికి కెసిఆర్ గెలుపు గజ్వేల్( Ghazwal ) లో నల్లేరుపై నడకే అన్న విశ్లేషణ ఉంది.
మరలాంటప్పుడు ఆయన కామారెడ్డి( Kamareddy ) ని ఎందుకు ఎన్నుకున్నారు అన్నది అర్థం కాని విషయం గా మారింది. అయితే గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించడానికి కంకణం కట్టుకున్న ఈటెల రాజేందర్ ఒకపక్క కొడంగల్ లో తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కేసీఆర్ ని ఎట్టి పరిస్థితులను గజ్వేల్ లో ఓడించి తీరుతానన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) శపధాలు మరోపక్క తో అనవసరమైన రిస్క్ ఏందుకు అన్న పార్టీ వ్యూహాత్మక కమిటీ నిర్ణయాన్ని గౌరవించి రెండో స్థానాన్ని ఎన్నుకున్నారని కొంతమంది విశ్లేషిస్తుండగా ఉత్తర తెలంగాణలో పార్టీ ఊపును కొనసాగించాలంటే తాను స్వయంగా అక్కడి నుంచి పోటీ చేయటం మంచిదన్న ఆలోచన తో ముందు చూపుతోనే ఆయన కామారెడ్డిని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది.
Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు