HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Will Launch The Yadadri Temple Very Simply With Fewer People

Yadadri temple: ఆలయ ప్రారంభోత్సవం.. చిన జీయర్ స్వామి, మోదీల‌కు కేసీఆర్ ఝ‌ల‌క్..!

  • By HashtagU Desk Published Date - 04:40 PM, Sun - 27 February 22
  • daily-hunt
Yadadri Yagam
Yadadri Yagam

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలల ప్రాజెక్టు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2014 నుంచి సీఎం హోదాలో దాదాపు 18 సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ ఇప్పటివరకు ఆలయ పునరుద్ధరణ పనులకు 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక మార్చి 28న యాదాద్రి ఆలయ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి చాలా త‌క్కువ మంది ప్ర‌ముఖుల‌ను కేసీఆర్ ఆహ్వానించునున్నారి స‌మాచారం.

ఈ నేప‌ధ్యంలో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం సంద‌ర్భంగా మార్చి 21 నుండి వారోత్సవాలను నిర్వహించాలని అనుకున్నారు కేసీఆర్. అయితే మార్చి 21 నాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం కుదరదని గుర్తించి మహా సుదర్శన యాగాన్ని కేసీర్ విరమించుకున్నట్లు అక్క‌డి అధికారులు చెబుతున్నారు. అయితే ఉగాది తర్వాత మహా సుదర్శన యాగం నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నార‌ని స‌మాచారం.

గోపురాలకు కలశముల‌ను బిగించడంతోపాటు పలు నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉనాయ‌ని, దీంతో మార్చి 28 ప్రారంభోత్సవం తర్వాత పునరుద్ధరించిన ఆలయ ప్రాంగణంలోకి, భ‌క్తులను అనుమతించడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో యాదాద్రి ఆల‌య‌ ప్రారంభోత్సవం తర్వాత భక్తులు మరో ఒకటి లేదా రెండు వారాలు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కలశములను సరిచేయడానికి కర్రల సపోర్టుతో స్కాఫోల్డింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఈ క్ర‌మంలో యాత్రికులు వ‌స్తూ పోతూ ఉంటే ప‌ని చేసే వారికి ఆటంకం క‌ల్గుతుంద‌ని, దీంతో పనులు మందగిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

యాదాద్రి పునఃప్రారంభం కోసం చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో 1,048 యాగ మండపాలు, 4,000 మంది ఋత్విక్కులు మొదలైన వాటితో మహా సుదర్శన యాగం నిర్వహించడం గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. అయితే మార్చి 21 సమీపిస్తున్న తరుణంలో హఠాత్తుగా యాదాద్రి ప్రారంభోత్సవంపై కేసీఆర్ సైలెంట్ అయ్యారు. అలాగే ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్‌లను ఆహ్వానించాలని చంద్రశేఖర్‌రావు ప్లాన్ చేశారు.ఆలయ పునరుద్ధరణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని గతంలో సీఎం కేసీఆర్ వెల్ల‌డింయాకె, ఈ క్ర‌మంలో గత ఏడాది సెప్టెంబర్ 3న ప్రధాని మోదీకి కేసీఆర్ ఆహ్వానం కూడా పంపారు.

అయితే ప్ర‌స్తుతం బీజేపీతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ త‌న ప్లాన్‌ను మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌ధ్‌యంలో రాష్ట్రపతిని, ప్రధానిని, ఎవరినీ ఆహ్వానించకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్‌కు యాదాద్రిలో హంగామా అక్కర్లేదని, కేసీఆర్ మాత్రమే హాజరై ఆలయ ప్రారంభోత్సవం చేస్తారట. మహా సుదర్శన యాగం కూడా కేసీఆర్ వాయిదా వేసినట్లు సమాచారం. ప్ర‌స్తుతం బీజేపీతోనూ, మోదీతోనూ కేసీఆర్ ప్రత్యక్ష పోరు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే .. దీంతో ఎవరిని ఆహ్వానించ కూడదని కెసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్ర‌ధాని మోదీ, జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించడం సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చినజీయర్ స్వామి మోదీని రాముడు అని కీర్తించడంతో, కేసీఆర్‌కు చినజీయర్ స్వామికి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ అంశాలన్నీ యాదాద్రి ఆలయ మహా ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ప్రభావం చూపనున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chinna Jeeyar SWamy
  • kcr
  • narendra modi
  • telangana
  • Yadadri Temple

Related News

Private Colleges

Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

Latest News

  • Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

  • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

  • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

  • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd