HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Will Launch The Yadadri Temple Very Simply With Fewer People

Yadadri temple: ఆలయ ప్రారంభోత్సవం.. చిన జీయర్ స్వామి, మోదీల‌కు కేసీఆర్ ఝ‌ల‌క్..!

  • Author : HashtagU Desk Date : 27-02-2022 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yadadri Yagam
Yadadri Yagam

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలల ప్రాజెక్టు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2014 నుంచి సీఎం హోదాలో దాదాపు 18 సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ ఇప్పటివరకు ఆలయ పునరుద్ధరణ పనులకు 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక మార్చి 28న యాదాద్రి ఆలయ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి చాలా త‌క్కువ మంది ప్ర‌ముఖుల‌ను కేసీఆర్ ఆహ్వానించునున్నారి స‌మాచారం.

ఈ నేప‌ధ్యంలో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం సంద‌ర్భంగా మార్చి 21 నుండి వారోత్సవాలను నిర్వహించాలని అనుకున్నారు కేసీఆర్. అయితే మార్చి 21 నాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం కుదరదని గుర్తించి మహా సుదర్శన యాగాన్ని కేసీర్ విరమించుకున్నట్లు అక్క‌డి అధికారులు చెబుతున్నారు. అయితే ఉగాది తర్వాత మహా సుదర్శన యాగం నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నార‌ని స‌మాచారం.

గోపురాలకు కలశముల‌ను బిగించడంతోపాటు పలు నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉనాయ‌ని, దీంతో మార్చి 28 ప్రారంభోత్సవం తర్వాత పునరుద్ధరించిన ఆలయ ప్రాంగణంలోకి, భ‌క్తులను అనుమతించడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో యాదాద్రి ఆల‌య‌ ప్రారంభోత్సవం తర్వాత భక్తులు మరో ఒకటి లేదా రెండు వారాలు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కలశములను సరిచేయడానికి కర్రల సపోర్టుతో స్కాఫోల్డింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఈ క్ర‌మంలో యాత్రికులు వ‌స్తూ పోతూ ఉంటే ప‌ని చేసే వారికి ఆటంకం క‌ల్గుతుంద‌ని, దీంతో పనులు మందగిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

యాదాద్రి పునఃప్రారంభం కోసం చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో 1,048 యాగ మండపాలు, 4,000 మంది ఋత్విక్కులు మొదలైన వాటితో మహా సుదర్శన యాగం నిర్వహించడం గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. అయితే మార్చి 21 సమీపిస్తున్న తరుణంలో హఠాత్తుగా యాదాద్రి ప్రారంభోత్సవంపై కేసీఆర్ సైలెంట్ అయ్యారు. అలాగే ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్‌లను ఆహ్వానించాలని చంద్రశేఖర్‌రావు ప్లాన్ చేశారు.ఆలయ పునరుద్ధరణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని గతంలో సీఎం కేసీఆర్ వెల్ల‌డింయాకె, ఈ క్ర‌మంలో గత ఏడాది సెప్టెంబర్ 3న ప్రధాని మోదీకి కేసీఆర్ ఆహ్వానం కూడా పంపారు.

అయితే ప్ర‌స్తుతం బీజేపీతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ త‌న ప్లాన్‌ను మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌ధ్‌యంలో రాష్ట్రపతిని, ప్రధానిని, ఎవరినీ ఆహ్వానించకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్‌కు యాదాద్రిలో హంగామా అక్కర్లేదని, కేసీఆర్ మాత్రమే హాజరై ఆలయ ప్రారంభోత్సవం చేస్తారట. మహా సుదర్శన యాగం కూడా కేసీఆర్ వాయిదా వేసినట్లు సమాచారం. ప్ర‌స్తుతం బీజేపీతోనూ, మోదీతోనూ కేసీఆర్ ప్రత్యక్ష పోరు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే .. దీంతో ఎవరిని ఆహ్వానించ కూడదని కెసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్ర‌ధాని మోదీ, జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించడం సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చినజీయర్ స్వామి మోదీని రాముడు అని కీర్తించడంతో, కేసీఆర్‌కు చినజీయర్ స్వామికి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ అంశాలన్నీ యాదాద్రి ఆలయ మహా ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ప్రభావం చూపనున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chinna Jeeyar SWamy
  • kcr
  • narendra modi
  • telangana
  • Yadadri Temple

Related News

Centre doubles duties on gold and silver.

Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…

దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుంచి 15%కి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5% అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) రూపంలో ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి (95.75) పడిపోవడం, వాణిజ్య లోటు పెరగడంతో దిగుమతులను

  • Stock Market India Today

    Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • PM Modi

    Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • PM Modi at Somnath Amrut Mahotsav

    Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd