KCR Startegy: బీజేపీపై టీఆర్ఎస్ పోరుబాట.. కేసీఆర్ వ్యూహమేంటి?
వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది.
- By Siddartha Kallepelly Published Date - 12:17 AM, Sat - 18 December 21
వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది. తాజాగా కేంద్రంపై పోరాటంలో భాగంగా కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు కొత్త ప్రోగ్రామ్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు తో పాటు కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20 అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చెయ్యాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈనెల 20న గ్రామ, మండల , జిల్లా స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు కాల్చి నిరసనలు తెలలపాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.
మరోసారి ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్రమంత్రిని కలిసి ధాన్యం కొనమని విజ్ఞప్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. బీజేపై దండయాత్ర చేయాలని, వినూత్న రీతిలో నిరసనలు తెలిపాలని కేసీఆర్ నిర్ణయించారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీతో తాడోపేతో తేల్చుకుందామని, మంత్రులందరిని కార్యక్రమాలు రద్దుచేసుసొని ఢిల్లీ వెళ్ళమని కేసీఆర్ సూచించారు. వరి ధాన్యం పై కేంద్రమంత్రులను కలవాలని, కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకుంటే అక్కడే కూర్చొవాలని కేసీఆర్ మంత్రులకు చెప్పారు. ధాన్యంపై ఎదో ఒకటి తేల్చుకున్నాకే తెలంగాణకు రావాలని, రైతుల గోస చూసి తాను షెడ్యూల్ చేసుకున్న జిల్లా పర్యటనలు కూడా రద్దు చేసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
అయితే తమిళనాడు పర్యటనలో స్టాలిన్ తో భేటీ తర్వాత కేసీఆర్ స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎన్ని మాట్లాడినా బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటేననే అభిప్రాయం చాల రాష్ట్రాల నేతల్లో ఉంది. అందుకే బీజేపీపై సీరియస్ గా పోరాడితేనే తన సీరియస్ నెస్ ఇతర రాష్ట్రాల నాయకులకు అర్ధమై వాళ్ళు తనతో కలిసొస్తారని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవం కోసం ఆహ్వానించడానికి త్వరలోనే కేసిఆర్ అన్ని రాష్ట్రాల సీఎంలను కలవనున్నారని సమాచారం. ఆ పర్యటనలోనే పలు ప్రాంతీయ పార్టీలతో కూడా సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. యాదాద్రి టెంపుల్ కోసం ఆహ్వానించడానికి వెళ్లినా ఆ భేటీల్లో తప్పకుండా రాజకీయాల ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆ లోపు బీజేపీపై సీరియస్ గా వరుసగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కేసీఆర్ అనుకున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమాలతో కేసీఆర్ కు చాలా లాభాలే ఉన్నాయి.రైతుల సమస్యపై సీరియస్ గా కొట్లాడుతున్నందుకు తెలంగాణ రైతులు, బీజేపీ వ్యతిరేకులు తమ వెంట ర్యాలీ అయ్యే అవకాశముంది. మంత్రులు ఢిల్లీకి వెళ్లి నిరసనలు తెలపడం ద్వారా జాతీయ స్థాయిలో పలు ప్రాంతీయ పార్టీల దృష్టిని కేసీఆర్ ఆకర్షించగలుగుతారు. దాంతో కేసీఆర్ కలలుకంటున్న థర్డ్ ఫ్రంట్ తో కలిసొచ్చే పార్టీల సంఖ్య పెరగడంతో పాటు ఆ ఫ్రంట్ లీడ్ చేయగల కెపాబిలిటీ కేసీఆర్ కు ఉందనే అభిప్రాయం పలు ప్రాంతీయ పార్టీల్లో కలిగే అవకాశముంది. ఇవన్నీ కలిసొస్తాయనే కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు కార్యక్రమం ఇచ్చినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Related News
Prashant Kishore : బీజేపీకి సీట్లు అస్సలు తగ్గవు.. జగన్కు ఓటమి ఖాయం : పీకే
లోక్సభ పోల్స్ ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.