HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Strategy Against Bjp In State

KCR Startegy: బీజేపీపై టీఆర్ఎస్ పోరుబాట.. కేసీఆర్ వ్యూహమేంటి?

వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది.

  • Author : Siddartha Kallepelly Date : 18-12-2021 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR-KTR

వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది. తాజాగా కేంద్రంపై పోరాటంలో భాగంగా కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు కొత్త ప్రోగ్రామ్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు తో పాటు కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20 అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చెయ్యాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈనెల 20న గ్రామ, మండల , జిల్లా స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు కాల్చి నిరసనలు తెలలపాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.

మరోసారి ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్రమంత్రిని కలిసి ధాన్యం కొనమని విజ్ఞప్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. బీజేపై దండయాత్ర చేయాలని, వినూత్న రీతిలో నిరసనలు తెలిపాలని కేసీఆర్ నిర్ణయించారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీతో తాడోపేతో తేల్చుకుందామని, మంత్రులందరిని కార్యక్రమాలు రద్దుచేసుసొని ఢిల్లీ వెళ్ళమని కేసీఆర్ సూచించారు. వరి ధాన్యం పై కేంద్రమంత్రులను కలవాలని, కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకుంటే అక్కడే కూర్చొవాలని కేసీఆర్ మంత్రులకు చెప్పారు. ధాన్యంపై ఎదో ఒకటి తేల్చుకున్నాకే తెలంగాణకు రావాలని, రైతుల గోస చూసి తాను షెడ్యూల్ చేసుకున్న జిల్లా పర్యటనలు కూడా రద్దు చేసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

అయితే తమిళనాడు పర్యటనలో స్టాలిన్ తో భేటీ తర్వాత కేసీఆర్ స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎన్ని మాట్లాడినా బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటేననే అభిప్రాయం చాల రాష్ట్రాల నేతల్లో ఉంది. అందుకే బీజేపీపై సీరియస్ గా పోరాడితేనే తన సీరియస్ నెస్ ఇతర రాష్ట్రాల నాయకులకు అర్ధమై వాళ్ళు తనతో కలిసొస్తారని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవం కోసం ఆహ్వానించడానికి త్వరలోనే కేసిఆర్ అన్ని రాష్ట్రాల సీఎంలను కలవనున్నారని సమాచారం. ఆ పర్యటనలోనే పలు ప్రాంతీయ పార్టీలతో కూడా సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. యాదాద్రి టెంపుల్ కోసం ఆహ్వానించడానికి వెళ్లినా ఆ భేటీల్లో తప్పకుండా రాజకీయాల ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆ లోపు బీజేపీపై సీరియస్ గా వరుసగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కేసీఆర్ అనుకున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమాలతో కేసీఆర్ కు చాలా లాభాలే ఉన్నాయి.రైతుల సమస్యపై సీరియస్ గా కొట్లాడుతున్నందుకు తెలంగాణ రైతులు, బీజేపీ వ్యతిరేకులు తమ వెంట ర్యాలీ అయ్యే అవకాశముంది. మంత్రులు ఢిల్లీకి వెళ్లి నిరసనలు తెలపడం ద్వారా జాతీయ స్థాయిలో పలు ప్రాంతీయ పార్టీల దృష్టిని కేసీఆర్ ఆకర్షించగలుగుతారు. దాంతో కేసీఆర్ కలలుకంటున్న థర్డ్ ఫ్రంట్ తో కలిసొచ్చే పార్టీల సంఖ్య పెరగడంతో పాటు ఆ ఫ్రంట్ లీడ్ చేయగల కెపాబిలిటీ కేసీఆర్ కు ఉందనే అభిప్రాయం పలు ప్రాంతీయ పార్టీల్లో కలిగే అవకాశముంది. ఇవన్నీ కలిసొస్తాయనే కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు కార్యక్రమం ఇచ్చినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • CK KCR
  • telangana
  • Telangana Rashtra Samithi (TRS)

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd