KCR Kanti Velugu: రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ‘కంటి వెలుగు’ కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
- By Balu J Published Date - 05:45 PM, Thu - 17 November 22

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్షించారు. ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ, ఇతర మంత్రులతో కేసీఆర్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. అయితే.. పథకంలో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమం అప్పుడు విజయవంతమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18వ తేదీ నుంచి #కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.#KantiVelugu pic.twitter.com/3Vk2TYIcxd
— Telangana CMO (@TelanganaCMO) November 17, 2022