Telangana : తెలంగాణ గవర్నర్ని కలిసిన జేఎన్టీయూహెచ్ విద్యార్థులు
జెఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కలిశారు. ప్రజా దర్బార్ సందర్భంగా...
- By Prasad Published Date - 07:15 AM, Mon - 24 October 22
జెఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కలిశారు. ప్రజా దర్బార్ సందర్భంగా రాజ్భవన్లో ఆమెను కలిశారు. R18 బ్యాచ్ విద్యార్థులకు ‘సబ్జెక్ట్ మినహాయింపు’ సౌకర్యం కల్పించడానికి జోక్యం చేసుకోవాలని కోరారు. ఏఐసీటీఈ అకడమిక్ నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి అర్హత సాధించాలంటే విద్యార్థికి 150-160 క్రెడిట్ల శ్రేణి అవసరమని స్పష్టంగా పేర్కొన్నారని జేఎన్టీయూహెచ్ విద్యార్థులు గవర్నర్కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. కానీ జేఎన్టీయూ-హెచ్ డిగ్రీ పొందేందుకు 160 క్రెడిట్లను తప్పనిసరి చేసి నిబంధనలు పాటించడం లేదని గవర్నర్కు తెలిపారు. JNTU-H మునుపటి నిబంధనలు (R07,R09,R15 మరియు R16) ఎనిమిది క్రెడిట్ల వరకు సబ్జెక్ట్ మినహాయింపు సౌకర్యం పొందాయని వారు ఆరోపించారు, అయితే విశ్వవిద్యాలయం R18 విద్యార్థులకు సబ్జెక్ట్ మినహాయింపు సౌకర్యాన్ని ఇవ్వలేదని తెలిపారు. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల కారణంగా విద్యార్థులు ఆఫర్ లెటర్లు పొందిన తర్వాత ఉద్యోగాల్లో చేరలేకపోతున్నందున సబ్జెక్ట్ మినహాయింపు సదుపాయాన్ని జారీ చేయవచ్చని JNTUH విద్యార్థులు తెలిపారుజ. యూనివర్శిటీల నుంచి కూడా ఆమోదం పొందిన తర్వాత కొంతమంది ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని పేర్కొన్నారు.
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�