MLA Muthireddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి.. కారణమిదే!
జనగామ ఎమ్మెల్యే (MLA) ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర వేదనకు గురయ్యారు.
- By Balu J Published Date - 04:55 PM, Tue - 9 May 23
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తరచుగా వివాదాల్లోకి ఎక్కుతుంటారు. ఆయనపై ఎన్నోసార్లు ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా మరోసారి ముత్తిరెడ్డి పేరు వినిపిస్తోంది. భూ వ్యవహరమై స్వయంగా ఆయన కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి (Muthireddy Yadagiri Reddy) తీవ్ర వేదనకు గురయ్యారు.
తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి.. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని ముత్తిరెడ్డి కుమార్తె భవానీ.. ఉప్పల్ ఠాణాలో (Police) ఇటీవల ఫిర్యాదు చేశారు. కుమార్తె ఫిర్యాదుపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన బిడ్డను రాజకీయ ప్రత్యర్ధులు వాడుకుంటున్నారని వాపోయారు. ప్రతి కుటుంబంలో (Family) సమస్యలు ఉంటాయని.. వాటిని ఇంట్లోనే తేల్చుకుంటామని చెప్పారు. చేర్యాలలో 1200 గజాల భూమి తన బిడ్డ పేరుపైనే ఉందని.. ఎటువంటి ఫోర్జరీ జరగలేదని ఎమ్మెల్యే (Emotion) కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: Tabu-Nag Dating: టబుతో డేటింగ్ రూమర్స్.. కింగ్ నాగార్జున రియాక్షన్ ఇదే
Related News
BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని