Telangana Congress:రేవంత్ చేసిన తప్పే జగ్గారెడ్డి చేస్తున్నాడా?
కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది సమిష్టినిర్ణయమై ఉండాలని కానీ ఈ మధ్ పార్టీలోని కొందరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాదించాడు.
- By Siddartha Kallepelly Published Date - 01:23 PM, Sun - 9 January 22
కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది సమిష్టినిర్ణయమై ఉండాలని కానీ ఈ మధ్ పార్టీలోని కొందరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాదించాడు. కానీ ఇప్పుడు ఆయన కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తన నియోజకవర్గంలో లే అవుట్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, లే అవుట్ లను రెగ్యులరైజ్ చేయాలని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కి లేఖ కూడా రాశారు. తాజాగా మరోసారి ఈ విషయంపై ప్రభుత్వానికి మరోసారి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని తాను మాత్రమే ఈ నిరసన తెలుపుతున్నానని జగ్గారెడ్డి తెలిపారు.
మొన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల విషయంలో కూడా విద్యార్థులను పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆరోజు కూడా కాంగ్రెస్ నేతలెవరూ ఆ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ కాలేదు. అయితే జగ్గారెడ్డి ప్రొటెస్ట్ చేసిన రోజే ప్రభుత్వం విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇది ముమ్మాటికీ తన విజయమేనని జగ్గారెడ్డి క్లెయిమ్ చేసుకున్నారు.
తాజాగా జగ్గారెడ్డి నిరసన తెలుపుతున్న లే అవుట్ రెగ్యులరైజ్ అంశం ఒక సంగారెడ్డి నియోజకవర్గనికే పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య కొనసాగుతుంది. కానీ పార్టీ తో సంబందం లేకుండా తాను ఒక్కడే ఈఅంశంపై దీక్ష చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మంజీర నీటి విషయంలో కూడా ఎవరికీ సంబంధం లేకుండా జగ్గారెడ్డి పాదయాత్ర చేశారు.
జగ్గారెడ్డి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుండడం, తాను చేసే నిరసనలో కాంగ్రెస్ నేతలెవ్వరూ పాల్గొనరని చెప్పడం కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తిని కలిగిస్తుంది.
అందరికి చెప్పి కలుపుకొని వెళ్లడం ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదని జగ్గారెడ్డి సింగిల్ గా వెళ్తున్నారా? లేదా తన తీరుని పార్టీ ప్రశ్నించినప్పుడు తనలాగా చేసిన మిగతా నాయకులని ఎందుకు ప్రశ్నించలేదని అడగడానికి జగ్గారెడ్డి ఇలా చేస్తున్నాడా అర్ధం కావట్లేదు. కానీ రేవంత్ చేసిన తప్పులని విమర్శించిన జగ్గారెడ్డి కూడా అదే బాటలో పోవడం పట్ల కాంగ్రెస్ లోని ఒక లేయర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Related News
CM Revanth Reddy : ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటాం
నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.