HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Indian Govt Added Megalithic Menhirs Site At Telanganas Mudumal Village For Unescos Proposal List

UNESCO : ప్రపంచ వారసత్వ రేసులో ‘నిలువురాళ్లు’.. ఎలా నిలబడ్డాయి? ఏం చేస్తాయి ?

నిలువురాళ్లకు(UNESCO) ఎగువన రాతిపై సప్తర్షి మండలాన్ని చెక్కారు.

  • By Pasha Published Date - 07:42 AM, Sat - 15 March 25
  • daily-hunt
Niluvu Rallu Site Megalithic Menhirs Mudumal Village Telangana Unesco Indian Govt

UNESCO : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ ఆరు ప్రదేశాల పేర్లను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో‌)కు భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ లిస్టులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్‌ గ్రామంలో ఉన్న నిలువురాళ్లకు కూడా చోటు దక్కింది. మన దేశంలో ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన 56 వారసత్వ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా  భారత సర్కారు పంపిన ఆరు ప్రదేశాలకు కూడా చోటు దక్కుతుందా ? లేదా ? అనేది వేచిచూడాలి. ఈసందర్భంగా ముడుమాల్ నిలువు రాళ్ల విశేషాలను తెలుసుకుందాం..

Also Read :Neem Leaves: వేప ఆకులను నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

ఏమిటీ నిలువురాళ్లు ? ఎందుకివి ? 

  • ముడుమాల్‌ గ్రామంలోని నిలువు రాళ్లను ఆంగ్లభాషలో మెగాలితిక్‌ మెన్హిర్స్ అని పిలుస్తారు.
  • ఈ నిలువు రాళ్లు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌ శివారులోని కృష్ణానది ఒడ్డున  ఉన్నాయి.
  • దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిలువు రాళ్లు ఉన్నాయి. గతంలో 10 నుంచి 14 అడుగుల ఎత్తులో వందకుపైగా నిలువురాళ్లు ఉండేవి. కాలక్రమంలో అవన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు కొన్నే మిగిలాయి.
  • హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె.పి.రావు తొలుత ఈ నిలువు రాళ్లను ముడుమాల్‌ గ్రామంలో గుర్తించారు.
  • నిలువురాళ్ల సంరక్షణ బాధ్యతను డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ చేపట్టింది. ప్రభుత్వ సహకారంతో వీటి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఈ రాళ్ల సంరక్షణకు ఒక వ్యక్తిని నియమించారు. టిటా గ్లోబల్‌ట్రస్ట్‌ వ్యవస్థాపకులు సందీప్‌ మక్తాల ఆధ్వర్యంలోనూ ఈ నిలువు రాళ్లపై పలు డాక్యుమెంటరీలు తయారు చేసి ప్రచారం చేశారు.
  • ఈ రాళ్లను క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి ఉండొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.
  • భారతీయుల ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి ఈ నిలువు రాళ్లు  నిదర్శనమని చెబుతుంటారు.
  • ప్రాచీన కాలంలో వాతావరణ మార్పులపై అంచనాకు వచ్చేందుకు ఈ రాళ్లను వాడే వాళ్లని చెబుతున్నారు. నిలువురాళ్ల నీడల ఆధారంగా సూర్య గమనాన్ని లెక్కించి.. రుతువులు, ఉత్తరాయణం, దక్షిణాయణం వంటివి నిర్ధారించుకునే వారట.
  • నిలువురాళ్లకు(UNESCO) ఎగువన రాతిపై సప్తర్షి మండలాన్ని చెక్కారు.
  • నిలువు రాళ్లను ఏర్పాటు చేసిన ప్రదేశం పక్కనే దాదాపు 50 ఎకరాల్లో గండశిలలతో ఏర్పాటు చేసిన గుండ్రటి నిర్మాణాలు ఉన్నాయి.
  • నిలువు రాళ్లను ఆదిమానవుల సమాధులపై నిలబెట్టి ఉంటారని పలువురు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.

Also Read :Donald Trump New Tax Plan: రూ. 1.31 కోట్ల వరకు సంపాదిస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్ప‌నున్న ట్రంప్!

  • ప్రపంచ వారసత్వ ప్రదేశాలను గుర్తించేందుకు  యునెస్కో ముమ్మర కసరత్తు చేస్తుంది.  ఇందుకోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తుంది.  వివిధ దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొంటాయి. అధిక దేశాల మద్దతు పొందే ప్రదేశాలకే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు లభిస్తుంది.
  • ఒకవేళ నిలువురాళ్లకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే, ఇక్కడికి విదేశీ పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. టూరిజం వికసిస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian Govt
  • megalithic menhirs
  • mudumal village
  • Niluvu Rallu Site
  • telangana
  • unesco

Related News

Krishna Water Dispute

Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!

కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్, పరిశ్రమలు కోల్పోయిందని ఏపీ వాదనలు వినిపించింది. ఇప్పుడు వ్యవసాయమే మిగిలిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి నీటి కేటాయింపులు తొలగించడం సరికాదని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. చ

  • Election Schedule

    Telangana Grama Panchayat Elections : నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

  • Telangana Sarpanch Election

    Sc Woman Sarpanch Seat : సర్పంచ్ పదవి కోసం ‘ఎస్సీ మహిళ’తో పెళ్లి.. కట్ చేస్తే సీన్ మెుత్తం రివర్స్..!

  • Telangana Wine Shops

    Grama Panchayat Elections : తెలంగాణ కొత్త మద్యం షాపులకు ‘పంచాయితీ ఎన్నికల’ కిక్కు!

  • Sarpanch Election Schedule

    Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

Latest News

  • Rahul Sipligunj : ఓ ఇంటివాడైన సింగర్ రాహుల్ సిప్లిగంజ్

  • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

  • Maruva Tarama : ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

  • Shubman Gill : టీమిండియా ఓటమి పై స్పందించిన శుభమన్ గిల్!

  • CM Revanth District Tour : జిల్లాల పర్యటనలకు సిద్ధం అవుతున్న సీఎం రేవంత్

Trending News

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd