T-Congress: రాహుల్ కోసం కదంతొక్కిన కాంగ్రెస్ శ్రేణులు!
రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ర్యాలీ నిర్వహించింది.
- By Balu J Published Date - 03:32 PM, Mon - 13 June 22
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోమవారం న్యూఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు హాజరుకానున్న రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ర్యాలీ నిర్వహించింది. గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ తమ నిరసన తెలుపుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైపు ర్యాలీ సాగుతుండగా నిరసనకారులు “సత్యమేవ జయతే” నినాదాలు చేశారు. బషీర్బాగ్ ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏఐసీసీ నాయకులు బోసురాజు, చిన్నారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నేతలు పాల్గొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో గాంధీలకు మద్దతుగా ఇలాంటి నిరసనలు జరిగాయి. న్యూఢిల్లీ, కేరళ, త్రిపుర, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్తో సహా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు జరిగాయి.
Related News
PM Modi Vs Rahul Gandhi : ప్రధాని మోడీ, రాహుల్గాంధీ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
PM Modi Vs Rahul Gandhi : రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.