Hyderabad: దేశ రెండో రాజకీయ కేంద్రంగా హైదరాబాద్?
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మూడేళ్ళ క్రితం జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా దానికి ఒప్పుకున్నాడు.
- By Siddartha Kallepelly Published Date - 10:29 PM, Wed - 12 January 22
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మూడేళ్ళ క్రితం జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా దానికి ఒప్పుకున్నాడు. ఢిల్లీ తరహాలో చేయడానికి మాత్రం ఆయన విముఖంగా ఉన్నాడు. ఆ క్రమంలో పొలిటికల్ సెకండ్ కేపిటల్ గా మార్చాలని ఎత్తుగడ వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దిశగా బీజేపీని ఓడించడానికి దేశాన్ని ఏకంచేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాటల వెనుక చాలా సీరియస్ ఇంటెన్షన్ ఉన్నట్లు కేసీఆర్ మూవ్మెంట్స్ చూస్తే అర్ధం అవుతోంది.రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనం ఏంటని, దేశం మొత్తానికి ఒకటే సుప్రీం కోర్టు ఉండడం ఏంటని గతంలో కేసీఆర్ ప్రశ్నించి ప్రాంతీయ పార్టీలనే కాకుండా దేశ ప్రజలని తనవైపు అట్రాక్ట్ చేసాడు. ప్రతిదానికి కేంద్రంపై ఆధారపడాల్సి వస్తొందని, కేంద్రం రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా ట్రీట్ చేస్తోందని ఈ పద్దతి మారాలంటే సెంట్రలైజేషన్ ని బద్దలు కొట్టాలని కేసీఆర్ పలుమార్లు అంతర్గతంగా చర్చించడమే కాదు బహిరంగంగా కూడా ప్రకటించారు.
దేశానికి రెండో రాజాధాని ఉండాల్సిన అవసరముందని, అది హైదరాబాద్ ఐతే బాగుంటుందనే చర్చ చాలా రోజులుగా ఉంది. ఈ విషయాన్ని అంబెడ్కర్ కూడా రాజ్యాంగం రాసిన రోజే ప్రస్తావించాడు. ఆ మేరకు బీజేపీ మేనిఫెస్టో కూడా ఉంది. ఈ అంశంపైనే కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య వామపక్ష పార్టీల జాతీయనాయకులతో హైదరాబాద్ వేదికగా చర్చ జరపడం, దాని తర్వాత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో జరిపిన చర్చల్లో కేంద్రం పెత్తనాన్ని బద్దలు కొట్టాలనే ఉమ్మడి అంశంపై మాట్లాడినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ లో కేసీఆర్ చర్చలు జరిపిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ నేత హేమంత్ సొరేన్ తో కూడా ఈ చర్చ ప్రధానంగా వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఫెడరల్ ఫ్రంట్ అవసరం, ఆవశ్యకత ప్రస్తుతం ఉందని భావిస్తోన్న కేసీఆర్ ఆ చర్చలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలప్పుడే ఫ్రంట్ పై ఫోకస్ చేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ఆ ప్రయత్నాల్ని వాయిదా వేసాడు. ఇక ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలతో పాటు హైదరాబాద్ ని సెకండ్ పొలిటికల్ సెంటర్ గా నిలిపే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ చేసే ఈ ఫ్రంట్ ప్రయత్నంతో దేశ రాజకీయాల్లో కేసీఆర్ మైలేజ్ పెరగడంతో పాటు, పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతల సపోర్ట్ తో హైదరాబాద్ సెకండ్ పొలిటికల్ సెంటర్ గా ఎస్టాబ్లిష్ అయితే తర్వాతి కాలంలోనైనా హైదరాబాద్ దేశానికి సెకండ్ క్యాపిటల్ అయ్యే అవకాశాలుంటాయని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఢిల్లీ తరహా రాజధానికి మాత్రమే బీజేపీ సై అనే అవకాశం ఉంది.
Related News
Hyderabad: హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో కాల్పులు: దోషికి పదేళ్ల జైలుశిక్ష
2007లో హైదరాబాద్లోని క్యాంపస్లోని ఇంజినీరింగ్ కాలేజీ మేట్పై కాల్పులకు పాల్పడిన విద్యార్థికి 10 ఏళ్ల జైలు శిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. 2013లో హైదరాబాద్లోని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉమీదుల్లా ఖాన్కు విధించిన జైలు శిక్షను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ సమర్థించారు.