Hyderabad: సనత్ నగర్లో నరబలి కలకలం.. హిజ్రా ఇంటిపై దాడి
హైదరాబాద్ (Hyderabad)లోని సనత్ నగర్ (Sanath Nagar)లో దారుణం చోటు చేసుకుంది. ఓ హిజ్రా 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్ వహీద్గా గుర్తించారు.
- By Gopichand Published Date - 08:41 AM, Fri - 21 April 23

హైదరాబాద్ (Hyderabad)లోని సనత్ నగర్ (Sanath Nagar)లో దారుణం చోటు చేసుకుంది. ఓ హిజ్రా 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్ వహీద్గా గుర్తించారు. అమావాస్య వేళ ఆ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికుల ఆరోపిస్తున్నారు. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభించడంతో సదరు మహిళ ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. సనత్ నగర్లోని అల్లాదిన్ కోటీ ఏరియాలో ఈ ఘటన జరిగింది. బాలుడి మృతదేహాన్ని ఏరియా సమీపంలోని నాలాలో గుర్తించారు. దీంతో సనత్నగర్లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: 1 Killed : వరంగల్ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి