Amit Shah: రామానుజాచార్యుల జీవితం.. యావత్ ప్రపంచానికి ఆదర్శం!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు.
- By Balu J Published Date - 10:32 PM, Tue - 8 February 22
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ షాను రిసీవ్ చేసుకొని స్వాగతం పలికారు. ఆ తర్వాత ముచ్చింతల్ కు వెళ్లారు. ఆశ్రమంలోని సమానత్వ విగ్రహాన్ని హోంమంత్రి సందర్శించారు. ఆశ్రమంలో నిర్మించిన 108 దివ్యదేశం (ఆలయాలు) కూడా సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన యాగాల్లో అమిత్ షా కూడా పాల్గొన్నారు.
“ప్రాణులన్నీ సమానమే అన్నది రామానుజాచార్యుల జీవిత సందేశం. అతను వేదాలలోని ప్రాథమిక వాక్యాన్ని తీసుకున్నారు. ఎవరితోనూ కటువుగా మాట్లాడకుండా తన చర్యల ద్వారా ఎవరినీ నొప్పించకుండా అనేక సంప్రదాయాలను కొనసాగించారని ”అని అమిత్ షా అన్నారు. ఈ సమానత్వ విగ్రహం దూరం నుండి అద్భుతంగా కనిపిస్తోందని హోంమంత్రి అన్నారు. రామానుజాచార్యులు దేశంలో సనాతన ధర్మాన్ని పెంపొందించి, యావత్ ప్రపంచానికి సమానత్వ సందేశాన్ని అందించారన్నారు. సమానత్వ విగ్రహం ఆత్మకు శాంతి చేకూరుస్తుందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, దండి స్వామీజీల పాద కమలం నుంచి సమానత్వ విగ్రహం ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమైందన్నారు.
Statue of Equality has recently been inaugurated by @narendramodi Ji and Chinna Jeeyar Swamy Ji.
By looking at this statue, the mind gets instilled with peace and happiness.
I am sure it will further Ramanujacharya Ji's message of Equality and Sanatan Dharma all over the world. pic.twitter.com/DFOaOAhmmQ
— Amit Shah (@AmitShah) February 8, 2022
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.