Government is a Key Decision : ఆ నిబంధన ను ఎత్తివేస్తూ సీఎం రేవంత్ సంతకం
Government is a Key Decision : ఇప్పటి వరకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన అమల్లో ఉంది.
- Author : Sudheer
Date : 22-10-2025 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఇద్దరు పిల్లల నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన అమల్లో ఉంది. ఈ నిబంధనను తొలగించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. చట్ట సవరణకు సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం చేశారు. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించిన తర్వాత, గవర్నర్ వద్దకు పంపనున్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ రూపంలో ఇది అధికారికంగా అమల్లోకి రానుంది.
Jubilee Hills Bypoll: ప్రచార బరిలో బిగ్ బుల్స్..ఇక దూకుడే దూకుడు
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. తెలంగాణలో ఇకపై ఇద్దరు పిల్లల పరిమితి లేకుండా ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వీలుంటుంది. రాష్ట్రంలో అనేక మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఈ నిబంధన వల్ల పోటీకి దూరమవుతున్నారని, ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేస్తున్నదని గతంలో అనేకసార్లు వాదించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధుల కొరత ఏర్పడటంతో, ఈ నిబంధనను సవరించాలన్న డిమాండ్ బలపడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు వెనుక మరో ప్రధాన ఉద్దేశం.. గ్రామీణ ప్రజల్లో రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడమేనని అధికారులు చెబుతున్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ప్రజాస్వామ్యంలో సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సవరణతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆస్పిరంట్ లకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. రాజకీయ వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, కొందరు సామాజిక కార్యకర్తలు జనాభా నియంత్రణ లక్ష్యాలకు ఇది ప్రతికూలంగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ప్రజా పాలనలో విస్తృత పాల్గొనింపు సాధించడంలో ఇది మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.