HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Government Gives Green Signal To 4 More New Iti Colleges In Telangana

ITI College : తెలంగాణ లో కొత్తగా మరో 4 ఐటీఐ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఎక్కడెక్కడంటే !!

ITI College : రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన టెక్నికల్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా నాలుగు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్‌ (ITI )ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

  • Author : Sudheer Date : 24-09-2025 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iti Collage
Iti Collage

తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన టెక్నికల్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా నాలుగు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్‌ (ITI )ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అచ్చంపేట సమీపంలోని కొండారెడ్డి, శామీర్‌పేట శివారులోని జినోమ్ వ్యాలీ, ఖమ్మం జిల్లా మధిర, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గాల్లో ఈ కొత్త ఐటీఐలు స్థాపన కానున్నాయి. ఇప్పటికే అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించగా, రానున్న మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా జినోమ్ వ్యాలీ ప్రాంతంలో పరిశ్రమలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో అక్కడ టెక్నికల్ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Cycling vs Walking: వాకింగ్ vs సైక్లింగ్ – ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల అభిప్రాయం

ఈ ఐటీఐలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సూచించిన ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండటంతో, నిర్మాణానికి పెద్ద ఆటంకం లేకుండా త్వరగా పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐల్లో 98 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీని ద్వారా ఈ రంగంపై విద్యార్థుల ఆసక్తి ఎంత పెరిగిందో అర్థమవుతోంది. భవిష్యత్తులో నైపుణ్యాధారిత ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఇది స్పష్టమవుతోంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఏ ప్రాంతాల్లో ఐటీఐ అవసరం ఉందో గుర్తించి, కొత్త కాలేజీలను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తోంది.

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో “యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు”ను నిర్మించే ప్రణాళికలో భాగంగా ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 78 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా “పబ్లిక్ స్కూల్స్” పైలట్ ప్రాజెక్టును నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ప్రారంభించనుంది. వీటిలో ఉచిత టిఫిన్, మధ్యాహ్న భోజనం, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.12 కోట్ల రూపాయల ఖర్చు అంచనా వేయబడింది. ఈ విధంగా ప్రాథమిక స్థాయి నుంచి టెక్నికల్ స్థాయి వరకు విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, తెలంగాణ యువతకు మంచి భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం సమగ్రంగా పనిచేస్తోందని చెప్పవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • ITI Colleges
  • New ITI Colleges
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd