Hyderabad Real Estate : కుప్పకూలనున్న ‘రియల్ ఎస్టేట్’
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం సమీప భవిష్యత్ లో కుప్పకూలనుంది.
- By CS Rao Published Date - 02:58 PM, Sat - 5 March 22
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం సమీప భవిష్యత్ లో కుప్పకూలనుంది. యుద్ధానికి, భారత రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధం ఏంటి? ఎందుకు కుప్పకూలనుంది? అనే అనుమానం పలువురికి రావొచ్చు. అందుకే, రియల్ ఎస్టేట్ రంగంలోని విదేశీ పెట్టుబడుల వాటాను తాజాగా కొలియర్స్ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం గత ఐదేళ్లతో పోల్చితే ప్రస్తుతం మూడు రెట్లు విదేశీ పెట్టుబడులు పెరిగాయని తేల్చింది. విదేశస్తులకు చెందిన 24 బిలియన్ డాలర్ల మూలధనం రియల్ రంగంలోకి ప్రవహించింది. అందుకే, హైదరాబాద్ తో పాటు భారత్ లోని వివిధ మెట్రోపాలిటిన్ నగరాల్లో రియల్ ఎస్టేట్ దూసుకుపోయింది. కోవిడ్ సమయంలోనూ ఆ గ్రోత్ కనిపించింది. కానీ, ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధం విదేశీ పెట్టుబడులను భారీగా తగ్గించనుంది.విదేశీ పెట్టుబడులు ఎక్కువగా యూరప్ దేశాల నుంచి ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ దేశాలు చాలా వరకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావానికి గురవుతాయి. ఫలితంగా భారత్ లోని రియల్ ఎస్టేట్ రంగం మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఆ ప్రభావం కనిపించనప్పటికీ రాబోయే ఆరు నెలల్లో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కుప్పకూలనుందని ఆ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొలియర్స్ నివేదిక ప్రకారం 2016లో ప్రవేశపెట్టిన సంస్కరణల ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులు భారతీయ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులపై ఎక్కువ మొగ్గు చూపారు. పారదర్శకతలేని కారణంగా పెట్టుబడులకు దూరంగా ఉన్న విదేశీ పెట్టుబడిదారులు 2017 నుండి తిరిగి భారత్ వైపు చూశారు. ఫలితంగా భారతీయ రియల్ ఎస్టేట్లో విదేశీ పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. మునుపటి ఐదేళ్ల కాలంలోని 37 శాతంతో పోలిస్తే 2017-2021 మధ్య కాలంలో 82శాతం వాటా కనిపించిందని కొలియర్స్ ఇండియా, క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అంచనా వేసింది. “ఆఫీస్ మరియు ఇండస్ట్రియల్ అసెట్స్ ఆస్తుల కోసం ప్రపంచ మూలధన ప్రవాహం భారతకు పరవళ్లు తొక్కింది.
భారతదేశంలోని మార్కెట్లలో రెసిడెన్షియల్ విక్రయాలు బాగా కొనసాగడం మరియు డెవలపర్ లు పెరగడానికి అవకాశాలు ఉండడంతో ప్రపంచ మూలధనం ఈ రంగంలో 82శాతం పెరిగింది. 2017-21లో, కార్యాలయ విభాగం మొత్తం విదేశీ పెట్టుబడులలో 43 శాతం వాటాను కలిగి ఉంది. ఇదే విదేశీ పెట్టుబడులలో అగ్రగామిగా నిలిచింది. ఆ తరువాత మిశ్రమ వినియోగ రంగం 18 శాతం వాటాను కలిగి ఉంది. ఆఫీస్ సెక్టార్ 2016లో రెగ్యులేటరీ సంస్కరణల తర్వాత విదేశీ మూలధన ప్రవాహాలలో గణనీయమైన పెరుగుదలను సాధించింది. గ్రేడ్ A ఆఫీస్ స్పేస్కు బలమైన డిమాండ్ మరియు REITల వంటి నిష్క్రమణ మార్గాలు పెట్టుబడులను పెంచాయి. కార్యాలయ రంగంలో విదేశీ పెట్టుబడులు 2021లో మినహా 2017 నుండి ప్రతి సంవత్సరం స్థిరంగా $2 బిలియన్లకు చేరింది. ప్రస్తుతం పెట్టుబడుల పరిమాణం దాదాపు సగానికి పడిపోయింది.
పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ రంగం నివాస రంగాన్ని అధిగమించి మూడవ స్థానంలో నిలిచింది. ఎన్బిఎఫ్సి సంక్షోభం మరియు రెసిడెన్షియల్ అమ్మకాలు తగ్గిన తరువాత ప్రపంచ పెట్టుబడిదారులు రెసిడెన్షియల్ సెక్టార్ గురించి జాగ్రత్తగా ఉన్నారు. మొత్తం విదేశీ పెట్టుబడులలో రెసిడెన్షియల్ ఆస్తుల వాటా 2017-2021లో 11 శాతానికి తగ్గింది. అదే, 2017కు ముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది. కోవిడ్ సమయంలో లైఫ్ సైన్స్ ల్యాబ్లు, డేటా సెంటర్లు, ఫ్లెక్స్ స్పేస్లతో సహా ప్రత్యామ్నాయ ఆస్తులకు డిమాండ్ పెరిగింది. గత ఐదేళ్లలో డేటా సెంటర్లు ప్రత్యామ్నాయాలలో గరిష్టంగా 52 శాతం విదేశీ పెట్టుబడులను పొందడం గమనార్హం. కీలక స్థానాల్లో ఆదాయాన్ని ఉత్పత్తి చేసే డేటా సెంటర్ ఆస్తులు లేకపోవడం మరియు భవిష్యత్తులో REIT జాబితాలకు స్కోప్ లేకపోవడం అభివృద్ధి అవకాశాల కోసం కొత్త ప్లాట్ఫారమ్లను రూపొందించడానికి పెట్టుబడిదారులను పురికొల్పుతుంది. గత ఐదేళ్లలో, గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్లు, కార్పొరేట్లు మరియు సంస్థలు $13.5 బిలియన్లకు సమానమైన మూలధన నిబద్ధతలను అందించాయి. భారతదేశంలో డేటా సెంటర్ల అభివృద్ధికి పెట్టుబడిదారులు ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ విమల్ నాడార్ చెప్పారు. తాజా నివేదిక ప్రకారం ఇప్పటికే రియల్ ఎస్టేట్ లోని నివాస రంగం కుప్పకూలడం ప్రారంభం అయింది. ఆఫీస్ స్పేస్ విభాగం కూడా అదే పంథాలో పతనం దిశగా ఉంది. మొన్నటి వరకు కోవిడ్ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరో ఆరు నెలల్లో హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలనుంది. ఆ విషయాన్ని అంతర్జాతీయ, దేశీయ సంస్థలు అధ్యయనం చేసిన తరువాత చెబుతున్నాయి. పెట్టుబడిదారులు తస్మాత్ జాగ్రత్త.!
Related News
GV Prakash: మా ఇద్దరి మధ్య గొడవ నిజమే.. అందుకే ఆరేళ్లు మాట్లాడలేదు: జీవి ప్రకాష్
జీవి ప్రకాష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ మేనల్లుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్నారు ప్రకాష్ . సూరరై పొట్రు, తలైవి, అసురన్, ఆడుకలం వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ని కూడా అందించిన జివి, ప్రస్