EX DSP Nalini Emotional Post : కన్నీరు పెట్టిస్తున్న డీఎస్పీ నళిని కథ..
- By Sudheer Published Date - 11:24 AM, Sun - 17 December 23
తెలంగాణ రాష్ట సాధన కోసం డిఎస్పీ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి..చరిత్ర పుటల్లోకి ఎక్కారు నళిని (EX DSP Nalini). ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన నళిని (EX DSP Nalini) స్వగ్రామం వరంగల్ జిల్లా. ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేందర్తో ఈమెకు వివాహం జరిగింది. నరేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎంకాం, బీఈడీ, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసిన నళిని 2006లో పరకాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం పొందారు. అనంతరం 2007 గ్రూప్-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. నళిని డీఎస్పీగా హన్మకొండ, హసన్పర్తి పోలీస్ స్టేషన్లలో మూడు వారాలపాటు ప్రొబేషనరీ విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెను కరీంనగర్ డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కొద్ది రోజులకే నళిని మెదక్ డీఎస్పీగా బదిలీ అయ్యారు.
డీఎస్పీగా (DSP) కొనసాగుతున్న ఆమె తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, పోలీసు శాఖలో ఆంధ్ర అధికారుల నిరంకుశ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సంచలనం సృష్టించారు. ఆ తర్వాత డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.
తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు. రేవంత్ చూపించిన ఆత్మీయత నతకు గొప్ప స్వాంతన కలిగించాయని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం తనను మూడేళ్లు ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం రోశయ్య మహిళా దినోత్సవం నాడు తనకు తన ఉద్యోగాన్ని కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో..నళిని తన రాజీనామా ఉప సంహరించుకొని తిరిగి ఉద్యోగంలో చేరారు. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అని నళిని చెప్పుకొచ్చింది. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లో పోస్టింగ్ ఇచ్చి,నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లనేషన్స్ రాయమనడం ,అనువల్ confidencial reports లో అడ్వర్స్( చెడు) రిమార్క్ రాయడం, బ్యాచ్ లో నా ఒక్క దానికే ప్రమోషన్ ను ఆపేయడం, ప్రోబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి CM కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొర పెట్టుకొనేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రం లో నాకు వారి అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయక పోగా, నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితి ని, రాష్ట్ర దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్ లో డీజీపీ కి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆ నాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నా లోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆరోజే హత్య చేశారు.
ఇప్పుడు 12 ఏళ్ల తరువాత సీఎం రేవంత్ స్పందించిన తీరు పైన నళిని ఉద్వేగానికి లోనయ్యారు. తాను ఎవరి కోసం ఇక ఎటువంటి త్యాగాలు చేయలేనని స్పష్టం చేసారు. వేద ప్రచారకురాలిగా సనాతన ధరమాన్ని ప్రచారం చేయటమే తన ముందున్న కర్తవ్యంగా నళిని స్పష్టం చేసారు. పోలీసు కాకుండా వేరే ఉద్యోగం తాను చేయలేననని వివరించారు. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు.వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను.జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు.ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను .జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను.వేద ప్రచారకురాలిగా,వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం.దీని వల్ల నా ఆత్మ ఉన్నతి తో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడిచ్చు.కాబట్టి నా పంథా మర్చుకొలేను అని తన గుండెల్లో ఉన్న బాధను బయటకు చెప్పుకుంది.
Read Also : Balineni Srinivasa Reddy : జనసేన లోకి బాలినేని..?
Related News
TS : గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: సీఈఓ వికాస్ రాజ్
Telangana: రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్(Chief Election Officer Vikas Raj) మీడియాతో మాటాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రమ ఎప్పటిలాగానే ఈ సారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర �