Etela Rajender : ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితున్ని నేనే – ఈటెల
ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని
- By Sudheer Published Date - 05:42 PM, Sun - 7 April 24
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ఫై మాజీ మంత్రి , మల్కాజ్ గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajender) కీలక వ్యాఖ్యలు చేసారు. ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని, ఈ ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేసారు. ఆదివారం అమీర్పేటలోని ఓ హోటల్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మాజీ సీఎం కేసీఆర్లానే తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఈటెల విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు నెరవేర్చలేదని, కేసీఆర్ హయాంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ ఇప్పటికీ రాలేదని ధ్వజమెత్తారు. మహాలక్ష్మీ పేరిట నగదు సాయం అమలు కావడం లేదన్న ఈటల, రైతు భరోసా, కౌలు రైతులకు సాయం రైతులకు బోనస్ ఇస్తామన్నారు కానీ, ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. కడియం శ్రీహరిని దళితుడు కాదన్న రేవంత్ రెడ్డి, మళ్లీ అతని కుమార్తెకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేదన్నారు.
రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు వెంటనే అనర్హులవుతారని చెప్పిన కాంగ్రెస్, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా తీసుకుందని , కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్, హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను వంచించడానికే గ్యారెంటీలు ప్రకటించిందని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
Read Also : MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య
Related News
Narendra Modi : కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదా
బలహీనమైన ప్రభుత్వం బలమైన దేశాన్ని తయారు చేయగలదా, కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదా అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశ్నించారు.