HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Efforts To Establish Private Wholesale Agricultural Market Yards In The Country Study In Telangana

Private Market Yards : ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డులు.. తెలంగాణలో అధ్యయనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006 సంవత్సరం నుంచే ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డుల(Private Market Yards)కు అనుమతులిచ్చే  విధానం అమల్లో ఉంది.

  • By Pasha Published Date - 08:25 AM, Thu - 9 January 25
  • daily-hunt
Private Agricultural Market Yards Telangana

Private Market Yards : వ్యవసాయ రంగంలో మరో సంచలన సంస్కరణ చేసే దిశగా కేంద్రంలోని మోడీ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డులను  ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రైవేటు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులు, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు నేరుగా రైతుల నుంచి వ్యవసాయ సరుకులు కొనే వెసులుబాటును కల్పించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రైవేట్ ఈ-ట్రేడింగ్‌ వేదికల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మోడీ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ అంశాలను ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదా’ విధానంలో స్పష్టంగా ప్రతిపాదించారు. అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయొచ్చని ఆ ముసాయిదాలో ప్రస్తావించారు.

Also Read :Tirupati Stampede : మృతుల వివరాలివే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006 సంవత్సరం నుంచే ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డుల(Private Market Yards)కు అనుమతులిచ్చే  విధానం అమల్లో ఉంది. అయితే ఇప్పటిదాకా ఒక్క  ప్రైవేటు మార్కెట్ యార్డు కూడా  ఏర్పాటు కాలేదు. ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదా’పై అధ్యయనానికి కమిటీ వేస్తామని తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి.

వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదా అమలైతే..

కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్‌ అహ్మద్‌ కిద్వాయ్‌ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ  ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదా’ను రూపొందించింది. దేశవ్యాప్తంగా మార్కెట్‌ వ్యవస్థలను ఏకీకృతం చేయడం, రైతులు తమ ఉత్పత్తులకు ఉత్తమ ధరను గుర్తించి విక్రయించే వెసులుబాటు ఉండటం వంటివాటిని తమ లక్ష్యాలుగా పేర్కొంది. ‘జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ ముసాయిదా’ అమల్లోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో పెను మార్పులు వస్తాయి. వీటివల్ల రైతులకు లాభం చేకూరుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఆ ప్రక్రియ అమల్లోకి వస్తే కానీ.. వాస్తవికత మన కళ్లెదుటకు సాక్షాత్కారం కాదు.  వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచి కొనేందుకు ప్రైవేట్‌ మార్కెట్లు ఏర్పాటవుతాయి. ఈ విధానంలో రైతుల నుంచి ఫుడ్‌ ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, వ్యవస్థీకృత రిటైలర్లు పంట ఉత్పత్తులు కొంటారు. ఆన్‌లైన్‌ క్రయవిక్రయాల కోసం ఈ-ట్రేడింగ్ వేదికలు అందుబాటులోకి వస్తాయి. ఎలక్ట్రానిక్‌ కమోడిటీ ఎక్స్ఛేంజీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. విధాన నిర్వహణకు జీఎస్టీ మాదిరిగానే అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.

Also Read :Pawan Kalyan : “OG ‘ సెన్సార్ పూర్తి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agricultural Market Yards
  • Market Yards
  • Private Market Yards
  • telangana

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd