Dr Raghu Ram: డాక్టర్ రఘురామ్కు అమెరికన్ ఫెల్లోషిప్.. దేశంలోనే అత్యున్నత పురస్కారం అందుకున్న క్యాన్సర్ సర్జన్!
వైద్యో నారాయణో హరీ.. ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ రఘు రామ్.
- By Balu J Published Date - 10:03 AM, Sat - 6 April 24
Dr Raghu Ram: వైద్యో నారాయణో హరీ.. ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ రఘు రామ్. ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో పనిచేస్తూ క్యాన్సర్ రోగులకు ఉత్తమ సేవలందిస్తున్నారు. ఫలితంగా ఆయనకు అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ (ఎఎస్ఎ) గౌరవ ఫెల్లోషిప్ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. 144 సంవత్సరాల చరిత్రలో దక్షిణాసియా అత్యున్నత పురస్కారం అందుకున్న మూడో సర్జన్ రఘురామ్ కావడం విశేషం. అమెరికా నలుమూలల నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధుల మధ్య డాక్టర్ రఘు రామ్ ప్రశంసా పత్రాన్ని అందుకొని తెలుగు ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ఏఎస్ఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ స్టీవెన్ స్టెయిన్ రఘు రామ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘డాక్టర్ రఘు రామ్ ఇండియాలో రొమ్ము క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఇతర డాక్టర్ల కంటే ముందున్నారు. దేశంలో రొమ్ము క్యాన్సర్ థెరపీకి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఇక సర్జికల్ లీడర్షిప్ పునర్నిర్మాణానికి ఆయన ఎంతగానో పడి ఇండియాలో శస్త్రచికిత్సకు రోల్ మోడల్ గా నిలిరాచు. రఘు రామ్ నిజంగా అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ గౌరవ ఫెలోషిప్ కు అర్హుడు ” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రఘు రామ్ పిల్లిశెట్టి మాట్లాడుతూ.. అమెరికా అత్యున్నత సంస్థ నుంచి ఈ ఉన్నత గౌరవాన్ని అందుకోవడం మరిచిపోలేనిది. నా కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే ఈ స్థాయికి చేరుకునేవాడ్ని కాదేమోనని అన్నారాయన. వైద్యరంగంలో అలుపెరగని కృషి చేశా. నా జర్నీలో తోడుగా నిలిచిన నా సహోద్యోగులను మరిచిపోలేననని అన్నారు. 1880 లో అమెరికాలో అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ సంస్థ (ఎఎస్ఎ) ఏర్పాటైంది. వివిధ దేశాల్లోని ప్రముఖ వైద్య రంగాలకు చెందిన వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో చాలా మంది ఈ సంస్థలలో శస్త్రచికిత్స విభాగాలకు చైర్మన్లుగా కొనసాగుతున్నారు. కాగా డాక్టర్ రఘు రామ్ కూడా కీలకంగా వ్యవహరించడంతో ఆయనకు ఫెల్లోషిప్ వచ్చింది.
Also Read: AP Trains Halting : స్పెషల్ ట్రైన్లు రయ్ రయ్.. ఏపీలో హాల్టింగ్స్ ఇవే
Related News
Ladies Hostel: షాకింగ్.. లేడీస్ హాస్టల్ లో మహిళ స్నానం.. రహస్యంగా ఫోన్ లో చిత్రీకరణ
Ladies Hostel: ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. అయితే వారంతా ఎక్కువగా హాస్టల్ లో ఉంటూ చదువుకోవడమో, జాబ్ చేయడమో చేస్తుంటారు. హాస్టళ్లలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వెంగళరావునగర్ లోని ఓ హాస్టల్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తులపై మధురానగర్ పోలీసులు కే