KTR: ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చేలా దళితబంధు : మంత్రి కేటీఆర్
162 మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు.
- By Balu J Published Date - 01:28 PM, Mon - 2 October 23
KTR: దళితబంధు పథకంలో భాగంగా 162 మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించింది. ఇందులో భాగంగా మరిన్ని కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని సంకల్పించింది.
దీనికోసం హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి ఆధ్వర్యంలో నడిచే మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను ఈ పథకం కింద అందచేశారు. పలువురు దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ముఖ్యోద్దేశం. దళితుల ఉద్ధరణ కోసమే.. తమ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తామన్నారు. ఇది కేవలం దమ్మున్న నాయకులతోనే సాధ్యమవుతుందని అన్నారు. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని అన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు. మహాత్మ గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టామన్నారు. గాంధీ జయంత్రి సందర్భంగా 162 సిల్ట్ కార్టింగ్ వెహికల్స్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
Also Read: Bigg Boss: బిగ్ బాస్ షో కోసం రతిక రోజ్ ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా!
Tags
Related News
KTR: మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటాను.. హామీ ఇచ్చిన కేటీఆర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య సంగీత విద్వాంసుడు దర్శనం మొగిలియ్యకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.