Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో డ్రగ్స్ వ్యాపారి అబ్బాస్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాస్ పలుమార్లు వివేకానందకు కొకైన్ డెలివరీ
- Author : Vamsi Chowdary Korata
Date : 27-02-2024 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో డ్రగ్స్ వ్యాపారి అబ్బాస్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాస్ పలుమార్లు వివేకానందకు కొకైన్ డెలివరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతర నిందితులు లిషి, శ్వేత, సందీప్లు ఇంకా పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ బృందం రాడిసన్ హోటల్లో పలు పార్టీలు నిర్వహించినట్లు డీసీపీ వినీత్ వెల్లడించారు.
నిందితులందరిలో వివేకానంద, కేదార్, నిర్భాయి కొకైన్ సేవించినట్లు తేలింది. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరయ్యాడా అనేది నిర్ధారణ కాలేదని, అయితే విచారణకు హాజరవుతానని చెప్పారు. క్రిష్ డ్రగ్స్ కేసులో ఉన్నాడన్న వార్తల నేపాప్థ్యంలో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. కాగా రాడిసన్ డ్రగ్ కేసులో ఇద్దరు మహిళలతో సహా తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు
Also Read: AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్సింగ్