Congress Legal war on Voters list : కొత్త ఓటర్ల జాబితాపై రగడ, న్యాయపోరాటానికి కాంగ్రెస్
Congress Legal war on Voters list : విపక్షాల ఆరోపణల నడుమ సెంట్రల్ ఎన్నికల కమిషన్ తెలంగాణలోని ఓటర్ల జాబితాను ప్రకటించింది.
- By CS Rao Published Date - 04:53 PM, Thu - 5 October 23
Congress Legal war on Voters list : విపక్షాల విమర్శలు, ఆరోపణల నడుమ సెంట్రల్ ఎన్నికల కమిషన్ తెలంగాణలోని ఓటర్ల జాబితాను ప్రకటించింది. జనవరి 6 నుండి సెప్టెంబర్ 28 వరకు 18–19 సంవత్సరాల ఓటర్లు 5, 32,990 మంది నమోదు చేసుకున్నారు. అంటే రాబోవు ఎన్నికల్లో కొత్త ఓటర్లు కీలకం కానున్నారు. తెలంగాణాలోని మొత్తం ఓటర్ల కంటే ప్రకటించిన జాబితాలోని ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై న్యాయపోరాటానికి దిగడానికి సిద్ధమయింది.
రెండేళ్లలో 22లక్షల ఓట్లను తొలగించినట్టు (Congress Legal war on Voters list)
తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్లలో 22లక్షల ఓట్లను తొలగించినట్టు సెంట్రల్ ఎన్నికల కమిషన్ (Congress Legal war on Voters list) ప్రకటించింది. అంటే, ఆ 22 లక్షల ఓటర్లు ఎటు పోయారు? మరణించారా? బోగస్ ఓట్లా? అనేది తేలాలి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బోగస్ ఓట్లను చేర్చారని విపక్షాలు చేసిన అతి పెద్ద ఆరోపణ. అప్పుడు చేర్పించిన ఓట్లను ఇప్పుడు ఎన్నికల కమిషన్ తొలగించిందా? అంటే సరైన సమాధానం లేదు. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించినట్టు ప్రకటించడం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాకం బయటపడుతోంది. అంతేకాదు, ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 5.8శాతం పెరిగింది. అంటే, 17.50 లక్షల ఓటర్ల పెరిగారని వెల్లడించడం గమనార్హం.
మూడు రోజుల పాటు సెంట్రల్ ఎన్నికల కమిషన్
మూడు రోజుల పాటు సెంట్రల్ ఎన్నికల కమిషన్ పర్యటించిన తరువాత ఓటర్ల జాబితాను ఫైనల్ చేసింది. మీడియా సమావేశాన్ని నిర్వమించిన సీఈసీ ఈ ఏడాది నుంచి 17,42,470 మంది ఓటర్లు పెరగడంతో మొత్తంగా 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి మునుపటి 992 నుండి 998కి చేరుకుంది. అయితే, ఈ సంవత్సరం 18-19 సంవత్సరాల వయస్సు గల 5,32,990 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. 3.17 కోట్ల మంది ఓటర్లలో పురుషులు మరియు మహిళా ఓటర్లు వరుసగా 1,58,71,493 మరియు 1,58,43,339 కాగా, 2,557 మంది థర్డ్ జెండర్కు చెందినవారు. 15,338 సర్వీస్ ఎలక్టర్లు మరియు 2,780 ఓవర్సీస్ ఎలక్టర్లు (Congress Legal war on Voters list)ఉన్నారు.
మరోసారి దరఖాస్తు చేసుకోవాలని
18-19 ఏళ్ల వయస్సులో లింగ నిష్పత్తి 707 నుండి 743కి మెరుగుపడింది. ఇది మునుపటి 992 నుండి 998కి చేరుకుంది. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4, 43,943 మంది ఉన్నారు. 5,06,493 మంది దివ్యాంగులు (వికలాంగులు). థర్డ్ జెండర్ల సంఖ్య 2,557కి పెరిగింది. ఎన్రోల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేని అర్హులైన వారందరూ (ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు మరియు ఇతరత్రా అర్హత ఉన్నవారు) రోల్లో చేరిక కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని (Congress Legal war on Voters list) అధికారులు కోరుతున్నారు.
Also Read : Telangana Voters List : తెలంగాణ ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల..మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా మొత్తం 22,02,168 మంది చనిపోయిన, డూప్లికేట్, షిఫ్ట్ అయిన ఓటర్లను తొలగించారు. గ్రేటర్ పరిధిలోని 4, 89,574 మంది ఓటర్లు, పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఈ ఏడాది 2,47,756 మంది చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డారు. “ప్రస్తుత SSR యొక్క విశేషమైన విజయం ఏమిటంటే జనవరి 6 నుండి సెప్టెంబర్ 28 వరకు 18–19 సంవత్సరాల ఓటర్లు 5, 32,990 మంది నమోదు చేసుకున్నారు. ఫలితంగా, జాబితాలలో 8, 11,640 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాలో ఇది 2.56 శాతం. గతంలో ఎన్నడూ ఈ శాతం సాధించలేదు. అంకితమైన AERO ద్వారా వారి కళాశాలల్లో 18+ పౌరులను గుర్తించడం ద్వారా మరియు 2019 నుండి 2022 వరకు పది పరీక్షలో హాజరైన విద్యార్థుల జాబితాను పొందడం వంటి ఇతర పద్ధతుల ద్వారా ఇది సాధించబడింది, ”అని అధికారులు తెలిపారు.
ప్రచురించబడిన 3,17,17,389 ఓటర్ల తుది జాబితా రాష్ట్రంలోని వాస్తవ ఓటర్ల కంటే ఎక్కువ. తుది ఓటరు జాబితాపై పార్టీ సర్వే నిర్వహించి, వ్యత్యాసాలను గుర్తించి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అంటూ కాంగ్రెస్ చెబుతోంది.
Also Read : Telangana Voters; 3 కోట్లు దాటిన తెలంగాణ ఓటర్లు
Related News
Viveka Murder Case : అవినాష్ బెయిల్ రద్దు ఫై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్
వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలంటూ కోర్ట్ లో వేసిన పిటిషన్పై విచారణ ముగిసింది