CM Revanth Counter to KTR : కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్
- By Sudheer Published Date - 12:14 PM, Sat - 16 December 23
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన ఈరోజు వాడివేడిగా నడుస్తున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ మొదలైనప్పటికీ..ప్రస్తుతం చర్చ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎలావుందో..బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందొ..అనేది చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
కేటీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎలా ఉండేది? అని సభలో ప్రశ్నించారు. ఆకలి కేకలు, పడవు పడ్డ బావులు అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదన్నారు. నల్గొండ లో ఫ్లోరైడ్ బాధలు, దేవర కొండలో గిరిజన బిడ్డల అమ్మకాలు జరగాయన్నారు. కొడంగల్ నుంచి బొంబాయి కు రెండు బస్సులు పోయేవి కాంగ్రెస్ హయాంలో అన్నారు. మహబూబ్ నగర్ నుంచి వలసలు ఉండేవన్నారు. తెలంగాణ పదం నిషేధిస్తే… ఒక్క కాంగ్రెస్ నేత మాట్లాడలేదన్నారు. పదవుల కోసం… పెదవులు మూసిన చరిత్ర కాంగ్రెస్ నేతలదే అని తెలిపారు. మాటి మాటికి మంత్రి ఎందుకు మాట్లాడతారా ? అని ప్రశ్నించారు.
భట్టి కూడా ఇంత ఆవేశం పడితే ఎలా? అని ప్రశ్నించారు. వలసలు వాస్తవం.. నెత్తురు పారిన నేల వాస్తవం అన్నారు. 2014 జూన్ లో రేవంత్ మాట్లాడిన మాటలు అన్నారు. మా తండ్రి చనిపోతే దహన సంస్కారం తర్వాత.. స్నానం చేద్దాం అంటే.. కరెంట్ లేదన్నారు. ఇది రేవంత్ మాట్లాడిన మాట అన్నారు. ఇందిరమ్మ పాలన గురించి గుర్తు చేయాలి కదా? అన్నారు. పోతిరెడ్డిపాడు గురించి చెప్పాలన్నారు. ఇందిరమ్మ పెరు అవసరం కోసం వాడతాం అంటే ఎలా? అని ప్రశ్నించారు. తెలంగాణకి కలిసి వచ్చే సమయానికి నడిసి వచ్చే కొడుకు కేసీఆర్ అన్నారు. జూన్ 2 ..2014 లోనే నిర్బంధం పోయిందన్నారు. బానిసకోక బానిస అన్నట్టు.. పీడించిన వాళ్ళ కి వారసులు వాళ్ళు.. 1.5 శాతం ఓటు తేడా మాత్రమే అన్నారు. మిడిసి పడొద్దు ఎక్కువ తేడా లేదన్నారు.
దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. ఎంపీగా, కేంద్రమంత్రిగా కేసీఆర్ కు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చిందన్నారు. పోతిరెడ్డిపాడు గురించి.. పీజేఆర్ ఒక్కరే పోరాటం చేశారని వెల్లడించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవరూ కొట్లాడలేదు.. ఐదేళ్ల సమయం ఉందని వివరించారు. ఏమేమి జరిగిందో.. అన్నీ లెక్కలతో సహా వివరిస్తాం.. 9 ఏళ్ల పాలనపై ఎక్స్ రే తీసినట్లు అన్నీ బయటపెడతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని వెల్లడించారు. గత చరిత్ర లో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామని వివరించారు.
కొంంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం అవగాహన కాదు అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా విలువ ఉంటుందని… 51 శాతానికి 100 శాతం వాల్యూ ఉంటుందని అభిప్రాయపడ్డారు. 51 శాతం ఉన్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని… 49 శాతం ఉన్న వాళ్లు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం చేసే నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే నిరసనలు చేపడతారు. అవసరమైతే అమరణ దీక్షలు చేస్తారు. ఆ స్పిరిట్ను తీసుకోకుండా వాళ్లు 65 మంది ఉన్నారు… మేము 39 మంది ఉన్నాం మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు వచ్చిన కొట్లాడతామంటే ఇక్కడ కుదరదు అన్నారు. ఇలాంటి భాష వాళ్లు గౌరవానికి సభను నడిపించడానికి బాగోదన్నారు.
గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కేసీఆర్కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఓడిపోయింది కేసీఆర్. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ, షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్కు కార్మిక శాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన హరీష్ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించిందని కాంగ్రెస్ పార్టీ అన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో కొట్లాడింది పీజేఆర్ మాత్రమే అన్నారు. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పీ జనార్దన్ రెడ్డి పోరాడారు. ఇక్కడ ఉన్న వాళ్లు ఎవరూ మాట్లాడలేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ గురువు చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకొని కేటీఆర్ గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని ఎత్తిపొడిచారు. చీమలు పెట్టినపుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్రెడ్డి పార్టీని బలోపేతం చేస్తే అక్కడకు ఎన్ఆర్ఐ(నాన్ రిలయబుల్ ఇండియన్ ) కోటాలో ఇక్కడకు వచ్చి టికెట్ తీసుకొని కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు. మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారు.
గతం గురించి చర్చింలానే ఆలోచన ఉంటే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకొని 2014 జూన్ 2 కంటే ముందు అంశాలపై సమగ్రంగా చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నామని దానికే కట్టుబడాలని సూచించారు. గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉందని అంటున్నారు. మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాత ఇచ్చిన స్క్రిప్టునే చదువుతారని అందరికీ తెలిసిందే. గతంలో పాలనలో కీలక పాత్ర పోషించిన వారు కూడా ఇలా విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.
9 ఏళ్ల పాటు జరిగిన ఆర్థిక విధ్వంసంపై చర్చిద్దామన్నారు రేవంత్రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలంటే చర్చలో పాల్గొనాలని సూచించారు. అంతేకానీ పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు అన్నారు. ఎప్పుటి నుంచో ఈ శాపనార్థాలు చూస్తున్నామన్నారు.
Read Also : Telangana Assembly Session : వాడివేడిగా నడుస్తున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Related News
CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.