HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr To Discuss Ap Ts Assets With Amit Shah Tomorrow In Delhi

AP TS Assets : న్యూఢిల్లీ భేటీ రేపే!ఉమ్మ‌డి ఆస్తులపై కేసీఆర్ స్కెచ్!!

ఎన్నిక‌ల వేళ ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం పార్టీలు చేసే ప‌ని. ఆ విష‌యంలో కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు.

  • Author : CS Rao Date : 26-09-2022 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Kcr Amitshah
Jagan Kcr Amitshah

ఎన్నిక‌ల వేళ ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం పార్టీలు చేసే ప‌ని. ఆ విష‌యంలో కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ప్ర‌స్తుతం ఏపీ విభజ‌న చ‌ట్టాన్ని కేంద్రం మెడ‌కు చుట్ట‌డానికి కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ వేశారు.మూడోసారి తెలంగాణ సీఎం కావ‌డానికి బీజేపీని టార్గెట్ చేయ‌డం మాత్ర‌మే మార్గ‌మ‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. ఆ క్ర‌మంలో అటు జ‌గ‌న్ ఇటు మోడీని సెంటిమెంట్ తో కొట్టాల‌ని భావిస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని 9, 10 షెడ్యూల్ అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. వాటిని ప‌రిష్క‌రించ‌కుండా ఎన్ని మీటింగ్ లు పెట్టిన‌ప్ప‌టికీ వేస్ట్ అంటున్నారు కేసీఆర్‌.

భౌగోలికంగా విడిపోయిన‌ప్ప‌టికీ అన్న‌ద‌మ్ముల్లా క‌లిసుందామ‌ని ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ ఇచ్చిన మాట‌. కానీ, ఇప్పుడు ఏపీకి అందాల్సిన విద్యుత్ బ‌కాయిలు రూ. 6వేల కోట్లు, తెలంగాన‌లోని ఏపీ ఆస్తుల మీద మెలిక‌పెడుతున్నారు. వాటిపై కోర్టుల్లో ఇప్ప‌టికే ఏపీ స‌ర్కార్ కేసులు వేసింది. ఇప్పుడు ఆ కేసుల‌ను ఉప‌సంహ‌రించుకునేలా కేసీఆర్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. తొలి రోజుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ వెంట‌వెంట‌నే మీటింగ్ లు పెట్టుకున్నారు. తొలి భేటీలోనే ఏపీ స‌చివాల‌య భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు ఇస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంగీక‌రించారు. ఆ త‌రువాత గోదావ‌రిపై ప్రాజెక్టు నిర్మాణం కోసం స‌మావేశ‌మైన సంద‌ర్బంగా కేసీఆర్ చేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌పై ఏపీ ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా నిర‌సించారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొంచం దూరంగా కేసీఆర్ కు మెలుగుతున్న‌ట్టు సంకేతాలు ఇచ్చారు.

ఉమ్మ‌డి ఆస్తుల పంప‌కం, వివాదాల‌పై కీల‌క స‌మావేశాన్ని కేంద్ర హోంశాఖ ఈనెల 27న( మంగ‌ళ‌వారం) ఢిల్లీలో నిర్వ‌హిస్తోంది. ఆ స‌మావేశానికి వెళ్ల‌కుండా ఉండేలా ముందుగా కేసీఆర్ మెలిక పెట్టారు. ప్ర‌స్తుతం ఏపీ వేసిన కేసుల‌ను కోర్టుల నుంచి ఉప‌సంహ‌రించుకుంటేనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని చెబుతున్నారు. ఉన్నతాధికారులతో పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను కేసీఆర్ సమీక్షించారని తెలుస్తోంది . న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

2014 నుంచి 2019 వరకు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడంలో సహకరించలేదని, పలుమార్లు చర్చలు జరపాలని టీఎస్‌ సూచించినప్పటికీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా వాటిని మరింత జఠిలం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న జ‌గ‌న్ కూడా “కోర్టు కేసులను ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తోందని కేసీఆర్ చెబుతున్నారు. AP వాటా కోరుతున్న హైదరాబాద్‌లో ఉన్న చట్టంలోని షెడ్యూల్ IX మరియు X కింద జాబితా చేయబడిన ఉమ్మడి సంస్థల ఆస్తులు మరియు అప్పులు, నగదు నిల్వలను సిఎం కేసీఆర్ పరిశీలించినట్లు తెలుస్తోంది.

స‌చివాల‌య భ‌వ‌నాల‌ను ఆయాచితంగా తీసుకున్న త‌ర‌హాలోనే మిగిలిన ఆస్తుల‌ను తీసుకోవాల‌ని కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ట‌. అందుకే , కేంద్రం, ఏపీ ప్ర‌భుత్వాల‌ను ఇరుకున పెట్టేలా కోర్టు కేసుల ఉప‌సంహ‌ర‌ణ లాజిక్‌ను బ‌య‌ట‌కు తీశారు. అంతేకాదు, అనుకూలంగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద మ‌చ్చ ప‌డ‌కుండా కేంద్రం మీద తుపాకీ పెట్టి పేల్చాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్రం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూద్దాం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • ap telangana bifurcation
  • Telangana CM KCR
  • YS Jagan Mohan Reddy

Related News

Centre to introduce key bills in Parliament

Parliament monsoon session: పార్లమెంటులో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం పలు అత్యంత కీలకమైన మరియు చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ సమావేశాలలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నది మన జాతీయ గేయం ‘వందేమాతరం’కు సంబంధించిన బిల్లు. వందేమాతరానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంతో పాటు దానికి తగిన అధికారిక గౌరవాన్ని చేకూర్చే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రతిష్టాత్మక బి

  • YS Jagan carried Mudragada Padmanabham Reddy's funeral bier.

    Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్

Latest News

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd