Chikoti Praveen Reacts:`జీయర్` తో సంబంధాలపై `చిక్కోటి`స్పందన
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సోషల్ మీడియా న్యూస్ మీద ఫిర్యాదు చేశారు.
- By CS Rao Published Date - 05:14 PM, Wed - 3 August 22
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సోషల్ మీడియా న్యూస్ మీద ఫిర్యాదు చేశారు. త్రిదండి చిన జియర్ తో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పడానికి మీడియా ముందుకొచ్చారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఈడీకి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే చికోటి స్పందించాడు. ఏపీ సీఎం జగన్, జీయర్ తో ఎలాంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా జీయర్, జగన్ తో సంబంధాలు ఉన్నాయని వస్తోన్న న్యూస్ మీద చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చికోటి ఫిర్యాదు చేశాడు.
గత నాలుగు రోజులుగా చీకోటి ప్రవీణ్ పై ఈడీ దర్యాప్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతల ప్రమేయం హవాలా వెనుక ఉందని వస్తోన్న న్యూస్ కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన న్యూస్ ను పలు కోణాల నుంచి సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోంది.
ప్రవీణ్ పేరుపై ఉన్న అకౌంట్ల ద్వారా న్యూస్ వస్తోంది. అందుకు స్పందించిన ప్రవీణ్ కొన్ని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, తనకు ఇబ్బంది కలిగేలా, తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫేక్ అకౌంట్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ఫిర్యాదు చేయడమే కాకుండా సంబంధిత ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Related News
Telangana BJP: బీజేపీలో చీకోటి ప్రవీణ్కు లైన్ క్లియర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.