Secunderabad Fire:`ఈ బైక్` పేలుడు సికింద్రాబాద్ ప్రమాదానికి కారణమా?
సికింద్రాబాద్ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్య్యూట్ కారణమా? లేక ఎలక్ట్రిక్ బైకులు చార్జి ఎక్కువగా కావడంతో పేలి ప్రమాదం జరిగిందా? అనేది ఇంకా తేలలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం గోడౌన్లో ఈ బైక్ లను చార్జి చేయడం కోసం ఉంచారు. మోతాదుకు మించిన చార్జింగ్ కావడంతో ఆ బైక్ లు పేలాయని తెలుస్తోంది.
- By CS Rao Published Date - 04:14 PM, Tue - 13 September 22

సికింద్రాబాద్ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్య్యూట్ కారణమా? లేక ఎలక్ట్రిక్ బైకులు చార్జి ఎక్కువగా కావడంతో పేలి ప్రమాదం జరిగిందా? అనేది ఇంకా తేలలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం గోడౌన్లో ఈ బైక్ లను చార్జి చేయడం కోసం ఉంచారు. మోతాదుకు మించిన చార్జింగ్ కావడంతో ఆ బైక్ లు పేలాయని తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా ఇటీవల ఈ బైక్ ల ప్రమాదాలు పెరిగాయి. సికింద్రాబాద్ సంఘటన కూడా ఈ బైక్ లను చార్జింగ్ చేసే క్రమంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. GEMOPAI బ్రాండ్కు చెందిన దాదాపు 35-40 ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ యూనిట్లతో భవనంలోని సెల్లార్లో ఉంచారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్క్ చేసిన ఈ-బైక్లను చార్జింగ్లో ఉంచడం వలన పేలి మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సికింద్రాబాద్లోని ఓ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. సంఘటన సమయంలో కనీసం 25 మంది భవనంలో చిక్కుకున్నారు. వీరిలో కొందరు కిటికీల నుండి దూకారు, మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
*రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ-బైక్ షోరూమ్లో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తాన్ని దగ్ధం చేసి షోరూం పైన ఉన్న హోటల్కు వ్యాపించాయి. పొగతో కమ్ముకున్న హోటల్లో చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు.
*దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల మంటల్లో ఈ ఘటన తాజాది.
*భవనం సెల్లార్ , గ్రౌండ్ ఫ్లోర్లోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన షోరూమ్ నుండి మంటలు వ్యాపించాయి. మంటలు వాణిజ్య భవనంలోని మొదటి నుండి ఇతర అంతస్తులకు వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు హోటల్ కిటికీల నుంచి దూకేందుకు ప్రయత్నించారు.
*నాలుగు అంతస్థుల భవనంలోని కిటికీల నుంచి పొగలు రావడంతో అందులోని పై అంతస్తుల నుండి ఒంటరిగా ఉన్న హోటల్ అతిథులను బయటకు తీయడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రేన్లు, ఇతర పరికరాలను ఉపయోగించారు.
*ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకుపోయిన ఏడుగురు అతిథులను రక్షించారు. వారిని ఆసుపత్రులకు తరలించారు.
*అధికారుల నుండి ఎటువంటి ఫైర్ ఎన్ఓసి తీసుకోలేదు. ఆవరణలో అగ్నిమాపక భద్రతా పరికరాలు పనిచేయలేదు.
*పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం లేదా సెల్లార్లో లేదా స్కూటర్ షోరూమ్ ఉన్న మొదటి అంతస్తులో బ్యాటరీలు చార్జింగ్ కావడం వల్ల జరిగిందా అనేది అగ్నిమాపక శాఖ విచారణ తర్వాత తెలియనుంది.
*హోటల్లో మొత్తం నాలుగు అంతస్తుల్లో 23 గదులు ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం మెట్ల మీదుగా కింది నుంచి పై అంతస్తు వరకు పొగలు వ్యాపించి, అన్ని అంతస్తులను పూర్తిగా చుట్టుముట్టాయి. మొదటి, రెండో అంతస్తుల్లో నిద్రిస్తున్న కొందరు దట్టమైన పొగతో కారిడార్పైకి వచ్చి ఊపిరాడక మృతి చెందారు.
*అగ్నిప్రమాదం జరిగిన భవనం యజమానిపై కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం అతడు పరారీలో ఉన్నాడు.
*ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ మంత్రి కేటీ రామారావు మృతులకు సంతాపం తెలుపుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Visited and inspected the site of fire accident that took place in Secunderabad today. pic.twitter.com/QunoB4okT0
— G Kishan Reddy (@kishanreddybjp) September 13, 2022