Telangana Budget Session 2026 : సామాన్య ప్రజలకు భారీ ఊరట కల్పించిన బడ్జెట్
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20, 2026న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజల ఆశలకు అద్దం పడుతోంది
- Author : Sudheer
Date : 20-03-2026 - 6:37 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20, 2026న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ సామాన్య ప్రజల ఆశలకు అద్దం పడుతోంది. మొత్తం రూ. 3,24,234 కోట్ల భారీ వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్, గత ఏడాది కంటే సుమారు రూ. 20 వేల కోట్లు అధికంగా ఉండటం విశేషం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు కాగా, మౌలిక సదుపాయాల కల్పన (Capital Expenditure) కోసం రూ. 47,267 కోట్లు కేటాయించారు. ప్రధానంగా విద్యా రంగానికి రూ. 26,674 కోట్లు, వ్యవసాయానికి రూ. 23,179 కోట్లు, మరియు వైద్య ఆరోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిచ్చింది.
ఈ బడ్జెట్లో సామాన్యులకు ఊరటనిచ్చే పలు కీలక పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేయడం, ఐటీఐ విద్యార్థులకు నెలకు రూ. 2,000 చొప్పున స్కాలర్షిప్ అందించడం వంటి నిర్ణయాలు పేద విద్యార్థులకు గొప్ప వరం. అంతేకాకుండా, జూన్ 2 నుంచి అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల భీమా సౌకర్యం కల్పించనున్నారు. మహిళా శక్తి పథకం కింద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ఐదేళ్లలో రూ. 1 లక్ష కోట్ల రుణాలను అందించే ప్రణాళికలు, సామాన్య మరియు మధ్యతరగతి వర్గాల ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తాయని చెప్పవచ్చు.
శాఖల వారీగా కేటాయింపులు చూస్తే..
విద్యాశాఖ -26,674
వైద్యారోగ్య శాఖ- 13,679
హోం శాఖ -11,907 కోట్లు
వ్యవసాయ శాఖ -23,179
విద్యుత్ శాఖ – 21,285
పౌరసరఫరాల శాఖ- 7,366
స్త్రీ, శిశు సంక్షేమం -3,143
ఎస్సీ అభివృద్ధి- 11,784
ఎస్టీ అభివృద్ధి- 7,937
మైనారిటీ సంక్షేమం-3769
ఇరిగేషన్ – 22, 615
మున్సిపల్ శాఖ -17,907
పశుసంవర్ధక శాఖ -1,529
రాజీవ్ యువ వికాసం -6,000
గృహ నిర్మాణం -7,430
ఐటీ శాఖ -875
చేనేత, జౌళి శాఖ -258
పరిశ్రమల శాఖ -3,490
పంచాయతీ రాజ్ -33,688
ఆర్ అండ్ బీ -12,789
న్యాయ శాఖ- 2,367
టూరిజం- 1,224
గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయింపు
ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు
గృహజ్యోతి – రూ.2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ – రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
చేయూత – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.5,500 కోట్లు
మహాలక్ష్మి పథకం – రూ.4,305 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ – రూ.3,500 కోట్లు
విద్యుత్ రాయితీ – రూ.14 వేల కోట్లు
కల్యాణలక్ష్మీ పథకం – రూ.3,683 కోట్లు
ఉపకారవేతనాలు – రూ.4,343 కోట్లు