Elections in Singareni : సింగరేణి ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం..
- By Sudheer Published Date - 11:34 AM, Fri - 22 December 23
సింగరేణి ఎన్నికల విషయంలో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సింగరేణిలో పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజీరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు, కార్యకర్తలు తీవ్ర అన్యాయానికి గురవుతారని వారు పేర్కొన్నారు. ముఖ్య నాయకుల రాజీనామాతో టీబీజీకేఎ్సలో కలకలం రేగింది. మరికొంతమంది నాయకులు రాజీనామా చేసే బాటలో ఉన్నారు. మరోవైపు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ… ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్యాసదృశమేనని అన్నారు. పోటీ చేయొద్దని చెప్పడం బాధాకరమని చెప్పారు.
Read Also : Panjagutta Fire Accident : పంజాగుట్ట ఎర్రమంజిల్లో అగ్నిప్రమాదం..
Related News
1300 Phones Tapped : నాలుగు నెలల్లో 1300 ఫోన్లు ట్యాప్ చేశారు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.