Munugode Caste Politics: మునుగోడు బరిలో రెడ్లు! ‘క్యాస్ట్ పాలిటిక్స్’పై బీసీలు ఫైర్!!
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతోంది. ఇప్పటికే పోస్టర్ల కలకలం, మందు పార్టీలతో చర్చనీయాంశమైన మునుగోడులో తాజాగా
- By Balu J Published Date - 12:46 PM, Sat - 15 October 22
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతోంది. ఇప్పటికే పోస్టర్ల కలకలం, మందు పార్టీలతో చర్చనీయాంశమైన మునుగోడులో తాజాగా క్యాస్ట్ పాలిటిక్స్ చర్చనీయాంశమవుతోంది. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాళ్లే. బీసీ ఓటు ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఏ ఒక్క బీసీ నేతకు టికెట్ ఇవ్వలేదని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెట్టిన పార్టీలపై వెనుకబడిన తరగతుల ఓటర్లు అయిన బీసీ సంఘాలు నేతలు మూడు ప్రధాన పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బీసీ సంఘాల నేతలను బాధ్యులను చేస్తూ రెడ్డి నాయకులతో కుమ్మక్కయ్యారని బీసీలు ఆరోపించారు. ఎన్నికల్లో బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు భవిష్యత్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తూ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా మునుగోడులో బీసీ సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారు. మునుగోడు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ ఏ ప్రధాన పార్టీ కూడా బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని కోరుకోవడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు కేవలం 20 శాతం జనాభా ఉన్న రెడ్డిలను రంగంలోకి దించాయని బీజేసీ నేత జాజుల అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో రెడ్డీలకు బీసీలకు ఎందుకు ఓటు వేయాలి.. దీనిపై బీసీలు సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని.. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ వర్గాల్లో అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నం’’ అని బీసీ నేతలు పేర్కొన్నారు.
అయితే ఎన్నికల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలని ప్రధాన పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాల నాయకులుగా చెప్పుకునే వారు ఏనాడూ సీరియస్గా పని చేయలేదని చండూరు మండలం గుండ్రపల్లికి చెందిన మల్లయ్యగౌడ్ అన్నారు. ” ప్రతి ఎన్నికలకు ముందు బీసీల కోసం గొంతు పెంచి, నామినేటెడ్ పదవి లేదా ప్యాకేజీ వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై ఓసీ నేతలను ఎప్పుడూ ప్రశ్నించరు. రాజకీయ సాధికారత కోసం నిజంగా కృషి చేసే బీసీ నాయకులు కావాలి’’ అని మల్లయ్యగౌడ్ అన్నారు.
Tags
Related News
Hyderabad: హైదరాబాద్ లో కొత్త ఓటర్ల సంఖ్య ఎంతంటే..
Hyderabad: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు 18 నుంచి 19 ఏళ్లలోపు 65,595 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం తెలిపింది. జనవరి 23, 2024 నుండి ఏప్రిల్ 15 వరకు, మొత్తం 88,509 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో యువకులు కూడా ఉన్నారు. ఓటర్ల జాబితా నుంచి 1.24 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి, ఇందులో డూప్లికేట