Delhi Liquor Scam Case : కవిత బెయిల్ ఫై బండి సంజయ్ ఎద్దేవా..కేటీఆర్ ఫైర్
కవిత బెయిల్ రావడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు. చివరి న్యాయం గెలిచిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
- By Sudheer Published Date - 03:21 PM, Tue - 27 August 24

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case)లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ (Kavitha Bail) మంజూరు కావడం బిజెపి ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎంతగానో ట్రై చేసిన కుదరకపోవడం తో సుప్రీం కోర్ట్ (Supreme Court) ను ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీం కోర్ట్ లో విచారణ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని వివరించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కవిత కు బెయిల్ రావడం తో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పటాకులు కాల్చి స్వీట్స్ పంచుకుంటున్నారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని.. రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని వారంతా అభిప్రాయపడుతున్నారు. బిఆర్ఎస్ శ్రేణుల కామెంట్స్ ఇలా ఉంటె..బిజెపి ఎంపీ బండి సంజయ్ మరో విధంగా స్పందించారు.
కవిత బెయిల్ రావడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు. చివరి న్యాయం గెలిచిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉపశమనం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ ఫై బీఆర్ఎస్, కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లీడర్ బెయిల్పై బయటకు కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు అని తెలిపారు. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్ రాజకీయ చతురత అని బండి సంజయ్ విమర్శలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. సంజయ్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సీజేఐ సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఆయన మాటలను కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
You’re a union minister incharge of Home Affairs & casting aspersions on Supreme Court !! Highly unbecoming of your position
I respectfully urge the Hon’ble Chief Justice of India & the respected Supreme Court to take cognisance of these comments and initiate contempt… https://t.co/171Bl4ZIiH
— KTR (@KTRBRS) August 27, 2024
Read Also : Minister Narayana : రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి : మంత్రి నారాయణ