Asaduddin Owaisi : అయోధ్య రామమందిరంపై ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- By Sudheer Published Date - 12:06 PM, Tue - 2 January 24
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)..అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir)పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ భవాని నగర్లో ఓ సమావేశంలో మాట్లాడుతూ..500 ఏళ్లుగా ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదన్నారు. అక్కడ మనం మజీద్ను కోల్పోయాం.. ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నాం.
మీ గుండెల్లో బాధ లేదా..? అని యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అందరం చనిపోతాం.. కానీ చనిపోయిన తర్వాత అల్లాకు ఏ విధంగా మీ ముఖం చూపిస్తారని యువతను ప్రశ్నించారు. దేశంలో మరో మూడు నాలుగు మసీదులకు సంబంధించి ఇలాంటి కుట్ర జరుగుతుందన్నారు. ఢిల్లీలోని సనేరి మసీద్ (గోల్డెన్ మసీద్) కూడా ఈ జాబితాలో ఉందన్నారు. ఏళ్లుగా కష్టపడి మనం ఈ స్థానాన్ని సంపాదించుకన్నాం. మీరు జరుగుతున్న విషయాలపై శ్రద్ధ వహించండి అంటూ పిలుపునిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
మన మసీదులు మన నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుంది అని .. మసీదులను ఎలా కాపాడాలో నేటి యువత జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు. మదర్సాలను కాపాడాలని ఒవైసీ కూడా విజ్ఞప్తి చేశారు. మన ఉలేమాలు వారి అంత్యక్రియలు జరిగినా ప్రజలు ఇస్లాం స్వీకరించే విధంగా ఉండేవారన్నారు. ప్రమాదం ఏ విధంగా వస్తుందో చెప్పలేం.. అందరూ చనిపోతారు కానీ మరణానంతరం ఏం సమాధానం చెబుతారు? అంటూ ముస్లిం యువతను ఉసిగొల్పుతూ.. మరణానంతరం అల్లాకు ఏ ముఖం చూపిస్తారో గుర్తుంచుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మరి కొన్ని రోజుల్లో అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also : Hanuman Pre Release Event : హనుమాన్ కోసం ఆ ఇద్దరు స్టార్స్..!
Related News
Asaduddin Owaisi : మజ్లిస్ నేతపై కాల్పులు.. అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదీ
మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్పై దుండగులు కాల్పులు జరిపిన ఘటనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.