Pawan Kondagattu: తెలంగాణలో కొండగట్టు నుంచే పాదయాత్ర మొదలుపెడ్తా!
తెలంగాణకు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధే ముఖ్యమని, లేదంటే శ్రీకాంతాచారి త్యాగం వృథా అవుతుందని జనసేన అధినేత
- Author : Balu J
Date : 18-10-2022 - 2:54 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణకు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధే ముఖ్యమని, లేదంటే శ్రీకాంతాచారి త్యాగం వృథా అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ క్యాడర్తో అన్నారు. సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణలో ఏడు లేదా పద్నాలుగు సీట్లు, రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలను ఎంచుకోవాలని క్యాడర్ను కోరారు. తెలంగాణలోని కొండగట్టు నుంచి తన యాత్రను ప్రారంభిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన విజయ పతాకం ఎగురవేయాలని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు జనసేనకు మద్దతుగా నినాదాలు చేశారు.