Pooja Bhatt with Rahul: భారత్ జోడోకు `వెండితెర` ప్లేవర్
భారత్ జోడో యాత్రకు రోజుకో అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ హైదరాబాద్ లో జరుగుతోన్న పాదయాత్రకు
- By CS Rao Published Date - 04:52 PM, Wed - 2 November 22
భారత్ జోడో యాత్రకు రోజుకో అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ హైదరాబాద్ లో జరుగుతోన్న పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ రాహుల్ కలిసి నడిచారు. తెలంగాణ మీదుగా సాగుతున్న 56వ రోజు యాత్రలో బుధవారం హైదరాబాద్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నటి పూజా భట్ పాల్గొన్నారు. “ప్రతిరోజూ కొత్త చరిత్ర సృష్టించబడుతోంది. దేశంలో ప్రేమించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది” అంటూ పూజా భట్ యాత్రలో చేరిన ఫోటోలు మరియు వీడియోలను పార్టీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ హ్యాండిల్లో భారత్ జోడో యాత్రతో 10.5 కిలోమీటర్లు నడిచినట్లు ధృవీకరించారు.
వీడియోలో, పూజా భట్ రాహుల్ గాంధీతో కరచాలనం చేస్తూ భారత్ జోడో యాత్రలో ముందు నడవడాన్ని చూడవచ్చు. భారత్ జోడో యాత్రకు మద్దతునిచ్చిన బాలీవుడ్ ప్రముఖుల్లో పూజా భట్ ఒకరు. అంతకుముందు రాహుల్ గాంధీని, యాత్రను స్వర భాస్కర్ ప్రశంసించారు. తెలంగాణలోకి అడుగుపెట్టిన తరువాత హీరోయిన్ పూనం కౌర్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ రాహుల్ తో కలిసి నడిచారు. ఆ సందర్భంగా చేతులో చేయివేసి రాహుల్ , పూనం ఉండే వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. ఆ వీడియోను బీజేపీ మరో కోణం నుంచి ఫోకస్ చేసింది.
తెలంగాణలో, భారత్ జోడో యాత్రలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ , తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన మహ్మద్ అజారుద్దీన్ ర్యాలీలో చేరడంతో కొంత స్టార్ ఫుల్ కవరేజ్ కనిపించింది. దక్షిణాది నటి పూనమ్ కౌర్ కూడా భారత్ జోడో యాత్రలో చేరి రాహుల్ గాంధీ వెంట నడిచారు.
2016లో వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ‘భారత్ జోడో యాత్రకు సంఘీభావం ప్రకటించారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచి, బీజేపీ-ఆర్ఎస్ఎస్ దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రోహిత్ వేములకి న్యాయం, రోహిత్ చట్టం, దళితులకు, అణగారిన వర్గాలకు ఉన్నత న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం, అందరికీ విద్య గురించి రాహుల్ గాంధీతో భేటీ అనంతరం రాధిక వేముల ట్వీట్ చేశారు. సామాజిక వివక్ష మరియు అన్యాయానికి వ్యతిరేకంగా నేను చేసిన పోరాటానికి రోహిత్ వేముల ప్రతీక అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మొత్తం మీద రాహుల్ భారత్ జోడో రోజుకో హైలెట్ పాయింట్ గా ఉంటుంది. ఆయన పిల్లలతో పరుగుతీసిన వీడియో, బస్కీలు తీసిన ఫోటోలు వైరల్ కావడం చూశాం. అలాగే, ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రసంగించడం హైలెట్గా ఉంది. గిరిజనులతో నృత్యాలు, కొమ్ములతో వేషధారణ ఇలా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో భారత్ జోడో ప్రజల్లోకి వెళుతుంది.
Related News
Heavy Heat Waves in Telangana : నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది మృతి
ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 19 మంది మృతి చెందారంటే అర్ధం చేసుకోవాలి.