Hyderabad: హైదరాబాద్ రోడ్లపై గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు రయ్ రయ్
హైదరాబాద్ రోడ్లపై త్వరలో పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది
- By Praveen Aluthuru Published Date - 09:22 PM, Tue - 19 September 23

Hyderabad: హైదరాబాద్ రోడ్లపై త్వరలో పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.మొదటి దశలో 25 బస్సులు సెప్టెంబర్ 20 బుధవారం నడవడం ప్రారంభిస్తాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గచ్చిబౌలి స్టేడియంలో తొలి 25 బస్సులను ప్రారంభించనున్నారు.
రెండవ దశలో బస్సులు నవంబర్లో నడవడం ప్రారంభిస్తాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణకు ఎలాంటి హానీ ఉండదని టీఎస్ఆర్టీసీ తెలిపింది. అలాగే ప్రయాణికులకు సౌకర్యవంతంగానూ ఉంటాయని పేర్కొంది. . 35 సీట్ల కెపాసిటీ కలిగిన గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సు పూర్తిగా ఛార్జ్ కావడానికి 3-4 గంటల సమయం పడుతుందని, ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరాన్ని ఒకే ఛార్జ్లో కవర్ చేయగలదని సంస్థ అన్నది. .12 మీటర్ల పొడవున్న ఈ బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు కూడా ఉన్నాయి, క్యాబిన్లో ఒకటి మరియు రికార్డింగ్ బ్యాకప్తో మరియు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటాయి.
ప్రయాణీకుల సౌకర్యార్థం ఛార్జింగ్ సాకెట్లు మరియు రీడింగ్ ల్యాంప్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహన ట్రాకింగ్ సిస్టమ్ మరియు పానిక్ బటన్ కూడా అందుబాటులో ఉన్నది. బస్సును వెనక్కి తిప్పేందుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గమ్యాన్ని సూచించే LED బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. అగ్ని ప్రమాదాలను గుర్తించి నిరోధించడానికి ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (FDSS) కూడా ఏర్పాటు చేయబడింది. ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది అని TSRTC తెలిపింది.
Also Read: KMC Ragging : ఏడుగురు మెడికోలపై కేసు నమోదు