ఈజీ మనీకి అలవాటు పడి.. టెలిగ్రామ్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ!
ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ టెలిగ్రామ్ లో ఇతరులకు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఇందుకుగాను ఒక్కొక్కరి దగ్గర్నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. దీంతో తెలంగాణ మహిళా విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
- By Balu J Published Date - 01:04 PM, Fri - 8 October 21

ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ టెలిగ్రామ్ లో ఇతరులకు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఇందుకుగాను ఒక్కొక్కరి దగ్గర్నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. దీంతో తెలంగాణ మహిళా విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన వంగల మధుకర్ రెడ్డి (23) హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఐదంకెల జీతం, మంచి జీవితం కళ్లముందున్నా.. ఈజీగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో చైల్డ్ ఫోర్నోగ్రఫీపై ఫోకస్ చేశాడు. తన వద్ద ల్యాప్ టాప్, మొబైల్ సాయంతో ఇతర వెబ్ సైట్స్ నుంచి చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్ లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలను టెలిగ్రామ్ ద్వారా ఇతరులకు షేర్ చేస్తున్నాడు. ఇందుకుగాను మధుకర్ ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేస్తున్నాడు. అయితే ఎక్కడా కూడా తన పేరు తెలియకుండా క్యూఆర్ కోడ్ తయారుచేసి, డబ్బు వసూలు చేస్తున్నాడు.
చిన్నపిల్లలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతుండటంతో కేంద్ర నిఘా సంస్థ చైల్డ్ పోర్నోగ్రఫీని బ్యాన్ చేసింది. వివిధ సైట్ల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేస్తున్న వాళ్లపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మహిళ విభాగం అధికారులు, సీఐడీ అధికారులు విచారణ చేపట్టగా, అసలు విషయం వెలుగుచూసింది. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్ లౌడ్ చేస్తున్న మధుకర్ ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ల్యాప్ టాప్, మొబైల్ ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Related News

BRS Minister: కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: గంగుల కమలాకర్
రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా తలపడాలి కానీ బండి సంజయ్ లాంటివారు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంభాన్ని వేదించాడని తీవ్రంగా ఆక్షేపించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో చేసిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో తన కుటుంభం ఊర్లో లేనప్పుడు, పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి, ఇంటిని దౌర్జన్యం చేస�