2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..
- By Sudheer Published Date - 12:59 PM, Tue - 5 March 24
హైదరాబాద్లోని ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద డీఎస్సీ 2008 బాధితులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వారంతా కోరుతూ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజా భవన్ లో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళవారం ప్రజల నుండి పిర్యాదులు తీసుకునే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కార్యక్రమం చేపట్టిన దగ్గరి నుండి ప్రతి మంగళవారం రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తమ బాధలు చెప్పుకునేందుకు వస్తున్నారు. తమ సమస్యలను తెలుపుతూ లేఖలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 300 మందికిపై 2008 DSC అభ్యర్థులు ప్రజాభవన్కు వచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. డీఎస్సీ 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని వారంతా కోరారు. తమ విషయమై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై సీఎం ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.
తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్రజా భవన్కు తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 300 మంది పైగా అభ్యర్థులు. #RevanthReddy #CongressParty #HashtagU https://t.co/qj4f4cagPY pic.twitter.com/ymwJOsQVUw
— Hashtag U (@HashtaguIn) March 5, 2024
Read Also : Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ
Related News
BRS party: మన్నె క్రిషాంక్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది : బీఆర్ఎస్ పార్టీ
BRS పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ కళ్యాణ్ రావు, లలిత రెడ్డి, సదానంద్, వేణు, అమృతరావు, కార్తీక్ తదితరులు తెలంగాణ భవన్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఒక తప్పుడు కేసు పెట్టి తెలంగాణ ఉద్యమకారుడు మన్నె క్రిషాంక్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా వేధిస్తుందో తెలంగాణ సమాజం గమనించాని అన్నారు. మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్ ఇప్పటివరకు 6 సెషన్ కోర్టులకు బదిలీ అయిందన