Khammam : ఖమ్మం జిల్లాలో భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు..కాంగ్రెస్ నేతలవే అని ప్రచారం
ఖమ్మం జిల్లా తో పాటు పెద్దపల్లి లో భారీగా నగదును పట్టుకున్నారు ఈసీ అధికారులు
- By Sudheer Published Date - 03:44 PM, Mon - 27 November 23
ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది..బరిలో నిల్చున్న అభ్యర్థులు ఏంచేసినా ఈ కొద్దిగంటల్లోనే చేయాలి..అందుకే అన్ని పార్టీల నేతలు ప్రచారం తో పాటు నోట్లను పంచడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులకు భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా తో పాటు పెద్దపల్లి లో భారీగా నగదును పట్టుకున్నారు ఈసీ అధికారులు. దాదాపు రూ.11 కోట్ల వరకు పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ మొత్తం డబ్బు కాంగ్రెస్ నేతలవే అని అధికారులు చెపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఖమ్మం జిల్లా ముత్తగూడెంలో 6 కోట్ల నగదును అధికారులు పట్టుకోగా… పాలేరులో రూ. 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలో 2 కోట్ల 18 లక్షల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో కాంగ్రెస్ సంబంధిత ప్రచార కార్యాలయంలో నిల్వ ఉంచిన ఈ నగదును ఎస్ఎస్టీ, ఎలక్షన్స్ స్క్వాడ్ సీజ్ చేశారు. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు.
Read Also : Visa Free Entry : డిసెంబరు 1 నుంచి వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లిపోవచ్చు
Related News
ASI Umadevi Suspended : బీజేపీ అభ్యర్థిని కౌగిలించుకున్నందుకు ఏఎస్ఐ సస్పెన్షన్..
మాధవీలత ను.. డ్యూటీలో ఉన్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి.. కౌగిలించుకొని, కరచాలనం వేసిన వీడియో వైరల్ గా మారింది