Xiaomi Launch: షియోమీ12 ప్రో 5జి నుంచి టీవి, ట్యాబ్ లాంచ్..!!
షియోమీ భారత్ లో ఇవాళ ఒక మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. షియోమీ ఈ ఈవెంట్ లో షియోమీ 12 ప్రో 5 జి, షియోమీ పాడ్ 5, షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ వంటి ఉత్పత్తులను విడుదల చేయనుంది.
- By Hashtag U Published Date - 01:29 PM, Wed - 27 April 22
షియోమీ భారత్ లో ఇవాళ ఒక మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. షియోమీ ఈ ఈవెంట్ లో షియోమీ 12 ప్రో 5 జి, షియోమీ పాడ్ 5, షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ వంటి ఉత్పత్తులను విడుదల చేయనుంది. షియోమీ 12 ప్రో 5జి పోయిన ఏడాది డిసెంబర్లో చైనాలో షియోమీ 12, షియోమీ 12ఎక్స్ తో పాటు ఆవిష్కరించింది. షియోమీ పాడ్ 5 లాంచ్ కూడా గతేడాది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ భారత్ లో కూడా ఇంతకు ముందు లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్ కింద కొత్త మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ ఈవెంట్ షియోమీ సోషల్ మీడియా హ్యాండిల్ అండ్ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
షియోమీ 12 ప్రొ 5జి ధరకు సంబంధించి బేస్ వేరియంట్ రూ. 65,000 ధరతో రిలీజ్ చేయనుంది. షియోమీ 12 ప్రో ఫీచర్స్ గురించి తెలుసుకున్నట్లయితే, దీనికి 5జి సపోర్ట్ లభిస్తుంది. అంతే కాకుండా, ఎంఐయూఐ 13 ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ 1,500 నిట్ల బ్రైట్ నెస్ తో 6.73-అంగుళాల WQHD + డిస్ప్లే పొందుతుంది. ఫోన్ స్నాప్డ్రాగన్ జెన్ 1 ప్రాసెసర్తో 12జిబి LPDDR5 ర్యామ్, మూడు బ్యాక్ కెమెరాలు ఉంటాయి, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX707 సెన్సార్గా ఉంటుంది. షియోమీ ప్యాడ్ 5 ధర సుమారు రూ. 30,000, బేస్ వేరియంట్ ధర అంటే 6జిబి ర్యామ్ తో 128జిబి మోడల్గా ఉంటుంది. షియోమీ పాడ్ 5 గ్లోబల్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కానుంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 ట్యాబ్లో కూడా ఇచ్చారు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్తో 11-అంగుళాల WQHD + డిస్ప్లే పొందుతుంది. దీంతో డాల్బీ విజన్ అండ్ హెచ్డిఆర్ 10కి సపోర్ట్ లభిస్తుంది. దీంతో పాటు ఫేస్ అన్లాక్, స్ప్లిట్ స్క్రీన్ వంటి మల్టీ-టాస్కింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ ట్యాబ్లో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ తో వస్తుంది, దీంతో 6జిబి LPDDR4X ర్యామ్ సపోర్ట్ ను ఇస్తుంది. ఈ ఈవెంట్లో షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ కూడా లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ టీవీని మూడు సైజులు, పాత మోడల్ కంటే ఎక్కువ ర్యామ్, స్టోరేజ్తో రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు.
Related News
First Private Rocket: నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేటు రాకెట్!
దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. షార్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రైవేటు రాకెట్