HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Samsung Message Guard Feature If This Feature Is Present Then The Phone Is Not Hacked

Message Guard: శామ్‌సంగ్‌ ‘మెసేజ్‌ గార్డ్‌’ ఫీచర్‌. ఈ ఫీచర్‌ ఉంటే ఫోన్‌ హ్యాక్‌ కాదు

కొన్ని సంవత్సరాల్లో స్మార్ట్‌ఫోన్‌ల (Smartphones) వినియోగం భారీగా పెరిగింది. చాలా రకాల సేవలు డిజిటలైజ్‌ అయ్యాయి.

  • By Maheswara Rao Nadella Published Date - 06:30 PM, Sat - 18 February 23
  • daily-hunt
Samsung Message Guard Feature. If This Feature Is Present Then The Phone Is Not Hacked
Samsung 'message Guard' Feature. If This Feature Is Present Then The Phone Is Not Hacked

కొన్ని సంవత్సరాల్లో స్మార్ట్‌ఫోన్‌ల (Smartphones) వినియోగం భారీగా పెరిగింది. చాలా రకాల సేవలు డిజిటలైజ్‌ అయ్యాయి. వీటితోపాటు సైబర్‌ నేరాల సంఖ్య కూడా పెరిగింది. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాలు అవగాహన కల్పిస్తున్నా.. మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ ఓ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ‘మెసేజ్ గార్డ్’ (Message Guard) పేరిట డెవలప్‌ చేసిన ఫీచర్‌ని శామ్‌సంగ్‌ ఫోన్లలో బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్‌గా అందిస్తున్నట్లు ప్రకటించింది.

రిస్క్ ఉండదు..

ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు ఎక్కువ. సైబర్ నేరగాళ్లు ఈ ఫోన్లను సులువుగా హ్యాకింగ్ చేస్తుంటారు. ఓ చిన్న లింక్‌ని క్లిక్ చేస్తే చాలు ఆండ్రాయిడ్ ఫోన్‌ హ్యాక్ అయిపోతుంది. ఏదైనా ఒక ఇమేజ్‌ని ఓపెన్ చేయడం వల్ల, మెసేజ్‌ లింక్‌పై క్లిక్ చేయడం వల్ల లేదా ఏదైనా ఒక ఫైల్‌ని ఓపెన్ చేయడం వల్ల ఫోన్‌ని హ్యాక్ చేస్తున్నారు. వీటిల్లో హానికారక కోడ్‌ని ప్రవేశపెట్టి.. వాటిపై క్లిక్ చేయగానే ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యేలా సైబర్ కేటుగాళ్లు డిజైన్ చేస్తున్నారు. ఇది తెలియకుండా స్మార్ట్‌ఫోన్ యూజర్లు బుట్టలో పడుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి శామ్‌సంగ్‌ ‘మెసేజ్ గార్డ్’ సెక్యూరిటీ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఇలా పనిచేస్తుంది?

ఫోన్‌లోకి వచ్చిన మెసేజ్‌లు, ఇమేజ్‌లను ఓపెన్ చేసే సమయంలో ఈ ‘మెసేజ్ గార్డ్’ (Message Guard) వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లో స్కాన్ చేస్తుంది. తద్వారా అది హానికరమైనదా? సాధారణమైన కంటెంటా అనే విషయాన్ని తేల్చుతుంది. ఒకవేళ హానికరమైన కంటెంట్ అయితే దానిని ఓపెన్ చేయనీయకుండా నియంత్రిస్తుంది. ఇలా ‘మెసేజ్ గార్డ్’ ఫీచర్ యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ శామ్‌సంగ్‌, గూగుల్ మెసేజెస్ యాప్‌లకు కంపాటబుల్ అవుతుంది. త్వరలోనే వాట్సప్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు శామ్‌సంగ్ వెల్లడించింది.

ఎస్ 23 సిరీస్‌లో అందుబాటులోకి:

తొలుత ‘మెసేజ్ గార్డ్’ సెక్యూరిటీ ఫీచర్‌ని గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S 23) సిరీస్ ఫోన్లలో తీసుకురానున్నట్లు శామ్‌సంగ్‌ వెల్లడించింది. ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారు మాత్రమే ‘మెసేజ్ గార్డ్’ ఫీచర్‌ని ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. వచ్చే ఏడాది నుంచి ఇతర గెలాక్సీ ఫోన్లలో కూడా ‘మెసేజ్ గార్డ్’ సెక్యూరిటీ ఫీచర్‌ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. సమీప భవిష్యత్తులో ఈ ఫీచర్‌ని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఇంటిగ్రేట్ చేయనుందని తెలిపింది.

స్వాగతించిన టెక్‌ నిపుణులు:

శామ్‌సంగ్‌ ఈ ఫీచర్‌ని తీసుకురావడంపై టెక్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది యూజర్లకు సైబర్ నేరాల నుంచి స్మార్ట్‌ఫోన్‌ని కాపాడుకోవడం తెలియకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ‘మెసేజ్ గార్డ్’ సెక్యూరిటీ ఫీచర్ యూజర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. తద్వారా డివైజ్‌లో హానికర కంటెంట్ ఇన్‌స్టాల్ కాకుండా ఉండే సౌలభ్యం ఏర్పడుతుంది. ఫోన్ డ్యామేజీ రిస్క్‌ని తగ్గించేందుకు ఆస్కారముంది. ఆండ్రాయిడ్ 14లో ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్లు రానున్నాయి. ఫలితంగా థర్డ్ పార్టీ యాప్‌లకు కూడా సెక్యూరిటీ ఫీచర్లు వర్తించనున్నాయి. ఇతర ఆండ్రాయిడ్ యాప్‌ల మాదిరే రిస్క్ లేకుండా ఇవి కూడా పనిచేయనున్నాయి.

Also Read:  OTT in Car: కారు స్క్రీన్‌పై ఓటీటీ యాప్స్ చూడాలనుకుంటున్నారా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • feature
  • hack
  • Message Guard
  • samsung
  • technology

Related News

Best Laptops

Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

ఈ జాబితాలోని చివరి మోడల్ HP నుంచి వచ్చింది. AMD Ryzen 3 Quad Core 7320U ప్రాసెసర్, 8 GB RAM, 512 GB SSDతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. Windows 11 Home సపోర్ట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,990కి లభిస్తోంది.

  • Jio Users

    Jio Users: జియో నుండి బంపర్ ఆఫర్.. 18 నెలలు ఉచితం!

Latest News

  • Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

  • RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

  • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

  • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd