Recession: ఆర్థిక మాంధ్యంలో కూడా కొత్త ఉద్యోగాలకు కొదవలేదు!
- By Nakshatra Published Date - 10:21 PM, Fri - 16 December 22
ఆర్థిక మాంధ్యంలో వస్తోంది అని, ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుంది అని ఈమధ్య బాగా వార్తల్లో వస్తుంది. దీనికి తగ్గట్టే అమెజాన్ ,ట్విట్టర్ ,విప్రో ,మైక్రోసాఫ్ట్ ఇలా ఎన్నో ఐటి దిగ్గజాలు తమ కంపెనీలో ఉద్యోగులకు మెల్లిగా ఉద్వాసన పలుకుతున్నారు. కాస్ట్ కటింగ్ కోసం ఇలా చేస్తున్నారు. పాపం దాంతో ఎందరో తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ప్రపంచమంతా ఈ రకంగా ఉంటే కానీ మన సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇండియాలోని లోకల్ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగుల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. ఇంచుమించు మనదేశంలో రెండు లక్షలకు పైగా వేకెన్సీలు ఈ కంపెనీలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇది గాల్లో వేసే లెక్కలు కాదు ఆర్థిక సేవల ప్లాట్ఫామ్ అయిన స్త్రైడ్ వన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రాబోయే కాలంలో ఇండియా సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల్లో ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. కాబట్టి ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నామని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత భారత్ ఐటీ ఇండస్ట్రీలో అతిపెద్ద దేశంగా అవతరించింది. పరిశ్రమ మరియు ఇంటర్నల్ ట్రేడ్ విభాగాల్లో ఇప్పటికే 7,70,000 స్టార్ట్ అప్ కంపెనీలు నమోదయ్యాయి.స్త్రైడ్ వన్ వ్యవస్థాపకుడైన ఇష్ ప్రీత్ సింగ్ గాంధీ ప్రకారం స్కేలబిలిటీ ,ఆల్టర్నేట్ ఫండింగ్, గ్లోబల్ మార్కెట్ విస్తరణ వంటి అంశాలు వ్యవస్థ పెరుగుదలకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని లక్షలాది మందికి ఉపాధి కలిగించే వెసలు కలుగుతుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా భారత్ జిడిపి నాలుగు నుంచి ఐదు శాతం వరకు పెరిగే సూచనలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే అసానకుల పరిస్థితుల్లో కూడా మనకు సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Related News
Office Peacocking : కార్పొరేట్ కంపెనీల్లో ‘ఆఫీస్ పికాకింగ్’.. ఏమిటిది ?
Office Peacocking : కార్పొరేట్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి.