HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Nokia Ceo Feels Smartphones Will Become Extinct By 2030

No Smartphones : 2030కల్లా స్మార్ట్ ఫోన్లకు చెల్లు చీటీ.. భవిష్యత్ మార్పుపై నోకియా సీఈవో సంచలన వ్యాఖ్యలు!!

మరో పదేళ్ల తర్వాత సంగతేమిటి ? " మార్పు" మాత్రం అనివార్యం. ఇంకొక మార్పేదో 2030 కల్లా ఫోన్ల మార్కెట్ లో జరగబోతోంది. సామాన్యులు దాని గురించి ఎంత చర్చించుకున్నా పెద్ద విలువ ఉండదు.

  • By Hashtag U Published Date - 09:30 PM, Thu - 2 June 22
  • daily-hunt
Nokia
Nokia

తొలుత ల్యాండ్ లైన్ ఫోన్లు..

వాటి తర్వాత నోకియా బండ పీసు ఫోన్లు..

ఆ తర్వాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు..

మరో పదేళ్ల తర్వాత సంగతేమిటి ? ” మార్పు” మాత్రం అనివార్యం. ఇంకొక మార్పేదో 2030 కల్లా ఫోన్ల మార్కెట్ లో జరగబోతోంది. సామాన్యులు దాని గురించి ఎంత చర్చించుకున్నా పెద్ద విలువ ఉండదు. కానీ ఫోన్ల మార్కెట్ ను దశాబ్దాల పాటు పిండేసిన ఉద్దండుడు మాట్లాడితే కచ్చితంగా మంచి విలువ ఉంటుంది. తాజాగా నోకియా కంపెనీ సీఈవో పెకా లుండ్ మార్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2030 కల్లా 6జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చి, ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లను అక్కరకు రాకుండా చేస్తుందని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతూ లుండ్ మార్క్ ఈ కామెంట్స్ చేశారు. అప్పటిదాకా మనుషుల శరీరంలోకి చిప్స్ పెట్టేంత యోగ్యంగా టెక్నాలజీ అభివృద్ధి చెందొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే స్మార్ ఫోన్లు అక్కరకు రాకుండా పోతే.. వాటి స్థానంలో ఎలాంటి డివైజ్ లు వస్తాయనేది క్లారిటీ ఇవ్వలేదు. స్మార్ట్ గ్లాస్ లు, మొహంపై ధరించే రియాలిటీ పరికరాల వంటివి వాడుకలోకి రావచ్చని అభిప్రాయపడ్డారు.

కాగా, ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరా లింక్ అనే కంపెనీ మనుషుల మెదళ్లలో అమర్చగలిగే చిప్ లను అభివృద్ధి చేస్తోంది. సమీప భవిష్యత్తులో వీటిని తొలుత మెదడు, వెన్నెముక, మతిమరుపు, పక్షవాతం వంటి రుగ్మతలు కలిగిన వారికి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. క్రమంగా వాటిని అందరికీ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ చిప్ లను మెదడు లో ఇంజెక్టు చేసుకున్న వాళ్ళు.. తమ ఆలోచనలకు అనుగుణంగా ఫోన్లు, కంప్యూటర్లలోని యాప్స్ కు దిశానిర్దేశం చేయొచ్చు. లుండ్ మార్క్ చెప్పినట్టే జరుగుతుందా ? జరగదా ? అనేది తేలాలంటే మరో పదేళ్లు వేచి చూడాల్సిందే!!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?

  • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

  • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

  • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

Trending News

    • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

    • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

    • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd